తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె.
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. సంజయ్లీలా భన్సాలీ రూపొందించిన ఈ సిరీస్లో బాలీవుడ్ అందాల భామలతో కలిసి సోనాక్షి చేసిన సందడి సినీ ప్రియుల్ని మెప్పించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
చిత్ర పరిశ్రమకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాను. కానీ కెరీర్ తొలినాళ్లలో అంతగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలోనే నన్ను సవాలు చేసే పాత్రలను ఎంచుకోవడం మొదలు పెట్టాను. అలాంటి పాత్రల కోసమే అన్వేషిస్తున్నాను. నేను భిన్నమైన పాత్రలను, ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టాను కాబట్టే.. నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదే నన్ను ‘దహాద్’, ‘హీరామండీ’ లాంటి ప్రాజెక్టులను ఎంచుకునేలా చేసింది. నాకు ఎన్నో పాఠాలు నేర్పిన నా అనుభవాలే.. ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.
- ప్రస్తుతం వస్తోన్న సినిమాల్లో హీరోలకు దీటుగా కథానాయికలు యాక్షన్ సన్నివేశాలు చేస్తూ వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. దీంతో పాటు చిత్రపరిశ్రమలో ఎక్కువగా మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు వచ్చి బాక్సాఫీసు వద్ద మంచి కమర్షియల్ వసూళ్లను సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను కూడా కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నాను. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినప్పుడు ఆ కథకు నేనే హీరోనని ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది.
- ఒక దర్శకుడి దృష్టిలో నేను ఏ జానర్లో అయినా.. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల నటిగా ఉండాలనుకుంటున్నాను. ‘దహాద్’లో మాదిరిగా ఒక గ్రామీణ పోలీసు అధికారిగా నటించగలను. ‘హీరామండీ’లో వేశ్యలాంటి పాత్రను పోషించగలను. ‘లుటేరా’ లాంటి చిత్రాల్లో ప్రేమికురాలిగా సినీప్రియుల్ని మెప్పించగలను. సరైన దర్శకుడు, సరిపోయే పాత్ర నాకు ఇస్తే.. నేనెంటో నిరూపించుకొని తెరపై మ్యాజిక్ చేసే సత్తా నాకు ఉంది.
- చిత్రపరిశ్రమలో నటీనటులు వారి నటనతో ప్రశంసలు అందుకోవడం చాలా సహజం. కానీ.. దీంతో పాటు విమర్శలను సైతం వారు స్వీకరించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. వారి అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీసి ప్రేక్షకులందరినీ మెప్పించాలంటే చాలా కష్టం. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాపై వచ్చే విమర్శలను నేను ఎప్పుడూ పట్టించుకోను.
- ఇంతియాజ్ అలీ, రాజ్కుమార్ హిరాణీ, రోహిత్ శెట్టి లాంటి దర్శకులతో ఒక్కసారైనా పని చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్