ఆ ప్రశ్నలకు సమాధానం.. లవ్ మౌళి
‘‘ఇరవయ్యేళ్ల ప్రయాణం తర్వాత... నా నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు నవదీప్.
‘‘ఇరవయ్యేళ్ల ప్రయాణం తర్వాత... నా నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు నవదీప్. ఆయన కథానాయకుడిగా... అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి కథానాయికలు. సి స్పేస్ నిర్మించింది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. నవదీప్ మాట్లాడుతూ ‘‘నా వ్యక్తిగత జీవితంలోని ప్రేమకథలు, వాటిలోని కొన్ని అంశాల్ని స్పృశిస్తుందీ కథ. ఈ కథకీ, ఇందులో స్పృశించిన అంశాలకీ ప్రేక్షకులు కనెక్ట్ అయితే వాళ్ల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ కొత్త రకమైన కథలతో సినిమాలు రూపొందుతున్నాయి. అదే కోవలో తెలుగులో రానున్న మరో విభిన్నమైన సినిమా ఇది. కథ వినగానే చేయాలనిపించింది. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చిరపుంజి, మేఘాలయా తదితర అందమైన ప్రదేశాల్లో, ఓ అందమైన సినిమా తీశాం. ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు రావాలనే ప్రశ్నకి ఈ చిత్రంతో సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యువతరం ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. కథానాయకుడు నవదీప్ చాలా కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? తదితర ప్రశ్నలకి సమాధానం మా సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.