నువ్వు ఏడిస్తే.. నా హృదయానికి కన్నీళ్లు..
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం నుంచి ‘రోయా..’ అనే కొత్త పాట విడుదలైంది. రాజ్కుమార్రావ్, జాన్వీ కపూర్ నాయకానాయికలుగా శరణ్ శర్మ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది.
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం నుంచి ‘రోయా..’ అనే కొత్త పాట విడుదలైంది. రాజ్కుమార్రావ్, జాన్వీ కపూర్ నాయకానాయికలుగా శరణ్ శర్మ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. ఇందులోని ‘నువ్వు ఏడ్చినప్పుడు.. నా హృదయం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నీ కోసం ఆరాటపడుతుంది.. ఓదార్పు కోసం వెతుక్కుంటుంది.. అప్పుడిక నీ కళ్లలోకి చూసే ధైర్యం నాకుండదు..’ అనే అర్థంలో సాగే పంక్తులు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఆట కోసం దూరమైన యువ జంట మధ్య వచ్చే ఈ గీతాన్ని విశాల్ మిశ్రా స్వయంగా రాసి, పాడి, స్వరాలు సమకూర్చారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.
సెప్టెంబరులో ‘లక్కీ భాస్కర్’
‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’గా మరోసారి అలరించడానికి వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 1980-90 కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతోంది. సాధారణ బ్యాంకు క్యాషియర్ అయిన భాస్కర్ ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారు. సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, ఛాయగ్రహణం: నిమిష్ రవి.
ఎలాన్ మస్క్కి బుజ్జి ఆహ్వానం
‘కల్కి 2898 ఎ.డి’ కోసం తయారైన బుజ్జి కారు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దేశం మొత్తం చుట్టేందుకు బయల్దేరిన ఆ కారు ప్రస్తుతం చెన్నై వీధుల్లో విహరిస్తోంది. బుజ్జి కారుని చూసేందుకు, నడిపేందుకు రావాలంటూ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్కి ఎక్స్ ద్వారా ఆహ్వానం పలికారు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్. ఆరు టన్నులు బరువున్న బుజ్జి పూర్తిగా భారతదేశంలో తయారైన ఎలెక్ట్రిక్ వాహనమనీ, మీ సైబర్ ట్రక్ (టెస్లా), బుజ్జి కలిస్తే చూసేందుకు చాలా బాగుంటుందంటూ అందులో పేర్కొన్నారు. ఇప్పటికే బుజ్జి కారుని భారతీయ తొలి ఫార్ములా వన్ రేసర్ కార్తికేయన్ నారాయణ్ సహా పలువురు ప్రముఖులు నడిపి మెచ్చుకున్నారు.
సత్యం కోసం పోరాటం
అగ్ర నటుడు ఆమిర్ఖాన్ తనయుడు జునైద్ఖాన్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘మహరాజ్’. జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి జునైద్ ఫస్ట్లుక్ పోస్టర్పాటు, విడుదల తేదీని పంచుకుంది చిత్ర బృందం. సత్యం కోసం పోరాటం అంటూ రాసుకొచ్చింది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. 1857 సిపాయిల తిరుగుబాటు, స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుకాలం నాటి వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ‘మహిళల హక్కులు, సామాజిక సంస్కరణల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆనాటి పాత్రికేయుడు, సంఘ సంస్కర్త కరణ్దాస్ ముల్జీ జీవితమే ఈ చిత్ర నేపథ్యం’ అని సినీవర్గాలు తెలిపాయి. యశ్రాజ్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాని నిర్మిస్తున్నారు.
ది గాడ్ఫాదర్’ నిర్మాత కన్నుమూత
‘ది గాడ్ఫాదర్’, ‘మిలియన్ డాలర్ బేబీ’ లాంటి ఆల్టైం గ్రేట్ చిత్రాల నిర్మాత, ఆస్కార్ అవార్డు గ్రహీత ఆల్బర్ట్ ఎస్ రూడీ (94) లాస్ఏంజెలిస్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పలు చిత్రాలకు రచయితగానూ పని చేశారు. కెనడాలో జన్మించిన రూడీ.. హాలీవుడ్లో 30 చిత్రాలు నిర్మించారు. తన జీవితకాలంలో ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్, ఫ్రాన్సిస్ కొపోలా, ఫ్రాంక్ సినాట్రా, క్లింట్ ఈస్ట్వుడ్, ఆల్ పసీనో, మార్లన్ బ్రాండ్..లాంటి ఎందరో దిగ్గజాలతో కలిసి పని చేశారు. హాలీవుడ్లో అండర్వరల్డ్, మాఫియా కథాంశాలతో వచ్చిన సినిమాలకు ఆయనే ఆద్యుడుగా పేర్కొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్