‘నమో’... ఓ భావోద్వేగం!
విశ్వంత్ దుద్దుంపూడి, అనురూప్ కటారి కథానాయకులుగా... ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నమో’. విస్మయ కథానాయిక. ఎ.ప్రశాంత్ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
విశ్వంత్ దుద్దుంపూడి, అనురూప్ కటారి కథానాయకులుగా... ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నమో’. విస్మయ కథానాయిక. ఎ.ప్రశాంత్ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, నిర్మాత బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకని ఉద్దేశించి కథానాయకుడు మాట్లాడుతూ ‘‘ఇది నాకు కేవలం సినిమానే కాదు, ఓ భావోద్వేగం. ఓ కుటుంబంలా కలిసి మెలిసి చిత్రీకరణ చేశాం. ఆదిత్య రాసిన పాత్రలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఇందులో లాజిక్స్ని పక్కనపెట్టి మ్యాజిక్ని మాత్రమే చూడాలి. కచ్చితంగా పైసా వసూల్ చిత్రం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మంచి కథకి, మంచి నటులు తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూస్తారు. విశ్వంత్, అనురూప్, విస్మయ చాలా బాగా నటించారు. రాహుల్ శ్రీ వాస్తవ విజువల్స్ అలరిస్తాయి. క్రాంతి ఆచార్య సంగీతం మరో ఆకర్షణ. ఎక్కడా రాజీ పడకుండా చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఆదిత్య నాకు ఎప్పటినుంచో తెలుసు. ప్రతిభావంతుడైన తను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది. ఆదిత్య తనని తాను నిరూపించుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు. కథని నమ్మి సినిమాలు తీసే దర్శకనిర్మాతలకు తప్పక విజయం చేకూరుతుందన్నారు బెక్కం వేణుగోపాల్. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
కుటుంబ కథతో రాణీ ముఖర్జీ
‘బొంబాయి టాకీస్’, ‘మర్దానీ’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తన నటనతో సినీప్రియుల్ని అలరించింది బాలీవుడ్ సీనియర్ నాయికా రాణీ ముఖర్జీ. గతేడాది ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె.. ఇప్పుడు మరో ప్రాజెక్టుతో తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా కుటుంబ కథతో రూపొందుతున్న ఓ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘గత రెండేళ్లుగా దర్శకుడు షోనాలి బోస్తో తన రాబోయే ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతుంది రాణి. భావోద్వేగాల కలయికలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో నటించడానికి అంగీకరించిందామె. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరు నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తుంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి