రిలే పాత్రకు అనన్య గాత్రం
నటనతోనే కాకుండా యానిమేటెడ్ చిత్రాల్లోని పాత్రలకు తమ గాత్రాన్ని అరువుగా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు కొందరు బాలీవుడ్ తారలు. కొన్ని రోజులు క్రితం ప్రియాంక చోప్రా ‘టైగర్’ చిత్రంలోని అంబా అనే ఆడపులి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసింది.
నటనతోనే కాకుండా యానిమేటెడ్ చిత్రాల్లోని పాత్రలకు తమ గాత్రాన్ని అరువుగా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు కొందరు బాలీవుడ్ తారలు. కొన్ని రోజులు క్రితం ప్రియాంక చోప్రా ‘టైగర్’ చిత్రంలోని అంబా అనే ఆడపులి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసింది. ఇప్పుడు యువ కథానాయిక అనన్య పాండే కూడా డిస్నీ చిత్రం, హిందీ వెర్షన్ ‘ఇన్సైడ్ అవుట్ 2’లోని రిలే పాత్రకు డబ్బింగ్ చెప్పనుందట. ఈ విషయాన్ని అనన్య స్వయంగా ఇన్స్టా వేదికగా తెలిపింది. ఈ సినిమాకి కెల్సే మాన్ దర్శకత్వం వహించారు. రిలే మనసులోని ఆరు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రం రూపొందింది. రిలే పాత్రకు తన గళాన్ని అందించడం పట్ల అనన్య తన ఆసక్తిని పంచుకుంది. ‘డిస్నీ, పిక్సర్ యానిమేటెడ్ చిత్రాలకు నేను వీరాభిమానిని. ఈ కథలు ప్రేక్షకుల్ని వినోదాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కొన్నేళ్ల క్రితం ‘ఇన్సైడ్ అవుట్’ చూసి నా బాల్యాన్ని గుర్తుచేసుకున్నాను. ఇలాంటి రంగుల ప్రపంచంలోని ఓ కథలో భాగమవుతానని ఎప్పుడూ ఊహించలేదు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ప్రస్తుతం ‘కాల్ మీ బె’ అంటూ అభిమానుల ముందుకు రానుంది అనన్య.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు