చాలా రకాలుగా ప్రత్యేకం.. సత్యభామ
‘‘నాయికా ప్రధానమైన సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటికీ వాటిలో మొదట గుర్తొచ్చేది విజయశాంతి ‘కర్తవ్యం’. అంతకంటే బలమైన నాయిక పాత్రతో రూపొందిన సినిమానే మా ‘సత్యభామ’.
‘‘నాయికా ప్రధానమైన సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటికీ వాటిలో మొదట గుర్తొచ్చేది విజయశాంతి ‘కర్తవ్యం’. అంతకంటే బలమైన నాయిక పాత్రతో రూపొందిన సినిమానే మా ‘సత్యభామ’. అసాధ్యమైన పనిని ఓ మహిళ సాధించిన తీరు ఈ కథలో హైలెట్’’ అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై ఆ ఇద్దరూ తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమానే ‘సత్యభామ’. కాజల్ ముఖ్యభూమిక పోషించారు. సుమన్ చిక్కాల దర్శకుడు. ‘మేజర్’ దర్శకుడు శశికిరణ తిక్క సమర్పణలో.. ఆయన రచించిన స్క్రీన్ప్లేతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు నిర్మాతలు.
‘‘ఇరవయ్యేళ్ల కిందట జరిగిన ఓ వాస్తవ సంఘటనని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ తయారు చేశాడు దర్శకుడు. ఈ కథని తెరపైకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నాక, హీరోయిన్ విషయంలో ముగ్గురు, నలుగురు పేర్లు అనుకున్నా, తొలి పేరు మాత్రం కాజల్దే. ఒకవేళ ఆమె ఈ కథని తిరస్కరిస్తే మరో కథానాయిక దగ్గరికి వెళ్లాలనుకున్నాం. కానీ కాజల్ ఈ కథ విన్న వెంటనే చేయడానికి ముందుకొచ్చారు. వాస్తవానికి ఆమె ఓ కథ విన్నాక రెండు మూడు రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తారట. కానీ ‘సత్యభామ’ కథ విషయంలో సమయమే తీసుకోలేదు. నిర్మాతలుగా మేం ఆ కథ విన్నాక ఎంత ఆత్రుతకి గురయ్యామో, ఆమె కూడా అదే అనుభూతికి గురయ్యారు. కథ, హీరోయిజం మొదలుకొని చాలా రకాలుగా ఇది ప్రత్యేకమైన సినిమా. ఓ బలమైన సందేశం కూడా ఉంటుంది. షి సేఫ్ యాప్ గురించి మా సినిమాలో చెప్పిన విషయాలు ఆలోచనని రేకెత్తిస్తాయి’’.
‘‘శశికిరణ్ తిక్క నాకు సోదరుడు (బాబీ తిక్క). ఆయన వల్లే మేం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. కొంతకాలంగా నేను, శ్రీనివాసరావు సినీ పంపిణీలో కొనసాగుతున్నాం. శశి ‘మేజర్’ పూర్తి చేశాక మేం సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయాలనుకున్నాం. మనకు నచ్చిన కథల్ని నచ్చినట్టు తెరపైకి తీసుకు రావచ్చనే ఉద్దేశంలో భాగంగానే నిర్మాణంలోకి వచ్చాం. శశి చేతిలో వేరే ప్రాజెక్టులు ఉండటంతో మేం ‘సత్యభామ’ కథని విని ఈ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టాం. తొలి సినిమాని హీరోతో కాకుండా, హీరోయిన్ ప్రధానమైన సినిమా తీస్తున్నారేమిటి అని చాలా మంది అడిగారు. అయితే దీన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనడం కంటే, హీరోయిజం ఓరియెంటెడ్ సినిమా అని చెప్పాలి. అంత బలమైన పాత్రలు ఇందులో ఉన్నాయి. కాజల్ చక్కటి సహకారం అందించారు. ఇది నా సొంత నిర్మాణ సంస్థ అన్నారు. అంతగా ఆమెతో మాకు అనుబంధం పెరిగింది. తెలుగులో విజయవంతమైన తర్వాత, దీన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచన చేస్తాం. మా తదుపరి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తీసుకు రావడానికి ప్రయత్నిస్తాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం