ఉపేంద్ర ‘ఎ’ మరోసారి
ఉపేంద్ర సినిమాల్లో ‘ఎ’ ఒక సంచలనం. 1998లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది.
ఉపేంద్ర సినిమాల్లో ‘ఎ’ ఒక సంచలనం. 1998లో విడుదలైన ఆ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఉపేంద్ర నటన, ఆయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ చిత్రాన్ని ఈ నెల 21న మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు ఎంటర్టైన్మెంట్, ఉప్పి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. నిర్మాత లింగం యాదవ్ మాట్లాడుతూ ‘‘26 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 20కోట్లకుపైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన ట్రెండ్ని సెట్ చేసిన ఈ సినిమా, ఇటీవలే మరోసారి విడుదలై మంచి స్పందనని సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల్నీ అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.
పుట్టినరోజు హంగామా
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బర్త్డే బాయ్’. విస్కి దర్శకుడు. బొమ్మా బొరుసా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్న సరదా సంభాషణలతో ప్రారంభమై, చిత్రంలోని పాత్రల్ని పరిచయం చేస్తుంది టైటిల్తో కూడిన ఈ ప్రచార చిత్రం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదొక కామెడీ డ్రామా చిత్రం. ఎం.ఎస్ చదవడానికి విదేశాలకి వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ని వాడాం. మంచి సాంకేతిక విలువలతో, నాణ్యమైన సినిమాని ప్రేక్షకులకు అందిస్తాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ప్రమోదిని, వాకా మణి, రాజా అశోక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ. భరత్, ఛాయాగ్రహణం: సంకీర్త్ రాహుల్, సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్.
న్యాయం కోసం వస్తున్నాం
‘‘ఎలా పోరాడాలో తెలియదు.. కానీ నాకు తెలిసిందల్లా యుద్ధమొక్కటే’’ అంటూ ఇటీవలే తన రాబోయే చిత్రం ‘వేదా’ ప్రపంచాన్ని పరిచయం చేసింది బాలీవుడ్ నాయికా శార్వరీ వాఘ్. ఆమె, జాన్ అబ్రహం, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. నిఖిల్ అడ్వాణీ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని తెలుపుతూ.. ఇన్స్టా వేదికగా ఓ పోస్టర్ను పంచుకుంది నిర్మాణసంస్థ. ‘‘న్యాయం కోసం వచ్చేస్తున్నాము. ఆగస్టు 15న రాబోతుంది ‘వేదా’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో మెరవనుంది. జీ స్టూడియోస్తో కలిసి జాన్ అబ్రహం, మోనీషా అడ్వాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పురాణాలు + సైన్స్ = ‘ఎ మాస్టర్పీస్’
‘‘సూపర్ హీరో పాత్రకు... మన పురాణాల నేపథ్యాన్ని జోడించి రూపొందించిన చిత్రమే ‘ఎ మాస్టర్ పీస్’ అన్నారు సుకు పూర్వజ్. ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ చిత్రాల్ని తెరకెక్కించిన ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమానే ‘ఎ మాస్టర్ పీస్’. మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, ఆషురెడ్డి ప్రధాన పాత్రధారులు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘భాగవతంలోని జయ విజయలు నేపథ్యంలో హీరో, విలన్ పాత్రల్ని డిజైన్ చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. పురాణాల్ని, సైన్స్నీ కలిపి చేశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’న్నారు. కథానాయకుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘‘నాకు ఈ అవకాశం వచ్చే ముందు అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయికి నేను ఓ సూపర్ హీరోలా ఉండాలనుకన్నా. అలా అనుకున్న సమయంలోనే నాకు సూపర్ హీరో సినిమాలో అవకాశం రావడం ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత మాధవ్, కథానాయిక జ్యోతి పూర్వజ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు