కొత్త చిత్రానికి శ్రీకారం
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా కార్తి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా కార్తి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్ర స్క్రిప్ట్ను పర్యవేక్షించడంతో పాటు స్వయంగా సంభాషణలందించారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా.. దర్శకుడు బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు కార్తి మాట్లాడుతూ.. ‘‘కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ట్రీట్ లాంటి చిత్రమిది. కథకు తగ్గట్లుగా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. దీన్ని మూడు షెడ్యూల్స్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి హిట్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. సాయిమాధవ్ సంభాషణలు ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు నిర్మాత శాంతనూపతి. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ నాయుడు, అవినాష్, సాక్షి చౌదరి, విశ్వజిత్, అంబిక కృష్ణ, దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గుజరాతీ చిత్రంలో.. దేవుడి పాత్రలో
మరికొద్ది రోజుల్లో ‘కల్కి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్. ఈయన 2022లో విడుదలైన ‘ఫక్త్ మహిళా వో మాతే’ అనే గుజరాతీ చిత్రంలో వ్యాఖ్యాతగా కనిపించి సినీప్రియుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సీక్వెల్గా ‘ఫక్త్ పురుషో మాతే’ను ప్రకటించింది చిత్రబృందం. జేబోదాస్, పార్థ్ త్రివేది సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులో కూడా ఆయన మరోసారి అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ పండిట్ మాట్లాడుతూ..‘‘తొలి భాగంలో కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారాయన. ఇప్పుడు రాబోయే సీక్వెల్లో బచ్చన్ దేవుడి పాత్రను పోషించారు. ఈ సినిమాకే ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన లేనిదే ఈ ప్రాజెక్టును ఊహించుకోవడం కష్టమ’’ని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్ సోని, మిత్రా గాధ్వి, దర్శన్ జరీవాలా తదితరులు నటిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
వినోదాల ఎక్స్ప్రెస్
చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని తెరకెక్కించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్ను నటి అమల అక్కినేని ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘టీజర్ ఫన్నీగా, రొమాంటిక్గా ఉంది. ప్రస్తుత సమాజంలోని వివాహ బంధాల గురించి ఒక బలమైన కథను చూపించనున్నట్లు అర్థమవుతోంది. దీన్ని అందరూ ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇది మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు బాల రాజశేఖరుని. ఈ సినిమాకి సంగీతం: కల్యాణి మాలిక్, ఆర్పీ పట్నాయక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.