ఓటీటీలో ఈ వారం
చూస్తుండగానే కొత్త వారం రానే వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ వారమంతా ఆస్వాదించడానికి ఓటీటీలు ఎలాంటి కంటెంట్ తీసుకురాబోతున్నాయో అని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సినీప్రేమికుల కోసమే ఈ వారం కూడా వైవిధ్యమైన చిత్రాలు, థ్రిల్ పంచే సిరీస్లతో వినోదాలు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి ఓటీటీలు.
ఆదాయం కోసం కాదు.. ఆస్వాదిస్తూ చేయాలి

‘‘జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు. ఆస్వాదిస్తూ కూడా చేయాలి. వ్యాపారంలో దొరకని తృప్తి.. వ్యాపకంలో దొరుకుతుంది’’ అంటూ ‘ఇడ్లీ కొట్టు’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు హీరో ధనుష్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నిత్యామేనన్ కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో రూపొంది థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు మీ ఇళ్లలో సందడి చేయడానికి ముస్తాబైంది. బుధవారం నెట్ఫ్లిక్స్ వేదికగా రాబోతుందీ చిత్రం. ఇందులో ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో తన నటనతో మెప్పించారు ధనుష్. అరుణ్ విజయ్, షాలినీ పాండే, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
లోక ప్రపంచానికి స్వాగతం

సూపర్ హీరో నేపథ్యంలో రూపొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది ‘లోక చాప్టర్ 1: చంద్ర’. మలయాళీ భామ కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్కు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లని సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఇందులో కల్యాణి.. సూపర్ పవర్స్ ఉన్న చంద్ర పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. ఇప్పుడీ లేడీ సూపర్ హీరో చిత్రం శుక్రవారం జియోహాట్స్టార్ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. మరి లోక ప్రపంచానికి స్వాగతం అంటున్న చంద్ర సాహసాలేంటో మీరూ చూసేయ్యండి.
శుక్రవారం... ‘కాంతార: చాప్టర్ 1’

‘‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాన్ని పంపుతూనే ఉంటాడు..’’ అంటూ ఇటీవలే ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాతో థియేటర్లలో అదరగొట్టారు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన దర్వకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మట్టి పరిమళాలు అద్దుకున్న ఈ కథనంలో రిషబ్ తన నటనతో కట్టిపడేశారు. ఈశ్వరుడు పంపిన గణం కాంతార అంటూ థియేటర్లలో విజిల్స్ వేయించిన ఈ సినిమా ఇప్పుడు శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆస్కార్లో లాబీయింగ్కు అవకాశం
తనకు అవార్డుల కంటే నటన బాగుందని ప్రశంసలు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు బాలీవుడ్ నటుడు పరేశ్ రావెల్. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల విషయంలో లాబీయింగ్కు ఆస్కారం ఉందని చెప్పారు. - 
                                    
                                        

జానపదానికి స్టెప్పేస్తే..!
కథానాయకుడు రవితేజ.. దర్శకుడు కిశోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. - 
                                    
                                        

ఆ రాకెట్కు ‘బాహుబలి’ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ‘ఎల్వీఎం3-ఎం5’ రాకెట్కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

కేరళ అడవుల్లో మైసా
రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరిం చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడామె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. - 
                                    
                                        

స్వర్ణోత్సవ వేడుకకు రంగం సిద్ధం
విలక్షణ నటుడిగా.. అభిరుచి గల నిర్మాతగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు మంచు మోహన్బాబు. - 
                                    
                                        

ఆమె ఓ స్టార్ అనే భావన రానివ్వలేదు
‘ప్రేమని మరో కోణంలో చూపించే సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితాలతో రిలేట్ చేసుకునేలా ఉంటాయి’’ అన్నారు హీరో దీక్షిత్ శెట్టి. ఆయన.. రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. - 
                                    
                                        

డిసెంబరులో అనన్య చిత్రం
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. గతంలో కార్తిక్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన సమీర్ విద్వాన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా ఉన్నా
‘‘యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రం ‘ఫీనిక్స్’. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు కథానాయకుడు విజయ్ సేతుపతి. - 
                                    
                                        

ఒక్క క్షణమైనా ప్రేమించావా?
‘‘మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తే.. మిమ్మల్ని ఎక్కువగా బాధించేవాడు! కళ్లతో చెప్పగలిగినది, మనసుతో చెప్పలేకపోయింది’’ అంటూ శంకర్ ముక్తిల గొప్ప ప్రపంచం నుంచి ‘ఉసే కహ్నా’ అనే గీతాన్ని విడుదల చేసింది ‘తేరే ఇష్క్ మే’ చిత్రబృందం. - 
                                    
                                        

కేరళ పురస్కారాల్లో మంజుమ్మల్ బాయ్స్ సత్తా
వయసుతో సంబంధం లేకుండా పాత్రలతో ప్రయోగాలు చేసే అగ్రహీరో మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా సత్తా చాటారు. సోమవారం 55వ చలన చిత్ర అవార్డులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చదువు కూడా లేని ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. అక్కడి రాజకీయ రాబందులకు కూడా చెక్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందన్న కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్ ‘మహారాణి సీజన్ 4’. బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో పునీత్ ప్రకాశ్ దీన్ని తెరకెక్కించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


