ప్రతి అంగుళం భూమి చిత్రపరిశ్రమకే ఉపయోగపడాలి

Eenadu icon
By Cinema Desk Updated : 28 Oct 2025 06:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’ ర్యాలీలో సినీ నటులు, నిర్మాతలు

కొవ్వొత్తుల ర్యాలీలో డి.సురేశ్‌బాబు, మురళీమోహన్, జెమిని కిరణ్, అశోక్‌కుమార్‌ తదితరులు 

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే : హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆవరణలో ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌.. బ్రింగ్‌ బ్యాక్‌ ది గ్లోరీ’ అంటూ సినీ నిర్మాతలు, నటులు సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, సినీ నటులు మురళీమోహన్, కె.అశోక్‌కుమార్, శివాజీరాజా, ఏడిద రాజా తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్, డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేలా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహించిందని, ప్రత్యేకంగా స్థలం కేటాయించగా అందులో ఫిల్మ్‌ఛాంబర్‌ భవనం నిర్మించినట్లు గుర్తుచేశారు.

దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనంలో ఇప్పటికీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కార్యాలయాలు ఉన్నాయన్నారు. దీన్ని ఎవరికో డెవలప్‌మెంట్‌కు ఇచ్చి అందులో మూడు వంతుల షేర్‌ కేటాయించటం ఎంతమాత్రం తగదన్నారు. ఇక్కడున్న ప్రతి అంగుళం సినిమా పరిశ్రమకే ఉపయోగపడాలన్నారు. సినీ నటుడు అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ  ఫిల్మ్‌ఛాంబర్‌ అభివృద్ధిపై సినీ పెద్దలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, నిర్మాతలు పాల్గొన్నారు.

Tags :
Published : 28 Oct 2025 01:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని