Double Ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో సంజయ్‌ దత్‌!

కథానాయకుడు రామ్‌.. దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది.

Updated : 29 Jul 2023 14:33 IST

థానాయకుడు రామ్‌.. దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో సినిమా చేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. ఇందులో సంజు ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా రామ్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి స్టంట్‌ డైరెక్టర్‌ కేచ నేతృత్వం వహిస్తున్నాడు. వచ్చే వారంతో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని