hyper aadi: 2019లో కనీసం ఆయన్ను గెలిపించుకోలేని మనం.. ఇలా అడగొచ్చా: హైపర్ ఆది
hyper aadi: పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు వచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తుండటంపై నటుడు హైపర్ ఆది మాట్లాడారు.
హైదరాబాద్: ‘తెదేపా, జనసేన పొత్తులో భాగంగా పవన్ పార్టీకి 24 సీట్లు అనగానే చాలా మంది ఆయన్ను తిడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన జెండాను కాలితో తొక్కుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనసు బాధగా ఉంద’ని సినీ నటుడు ‘హైపర్’ ఆది (Hyper Aadi) అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పెషల్ వీడియోలో మాట్లాడగా, జనసేన నాయకుడు నాగబాబు తన ఎక్స్లో (ఇంతకు ముందు ట్విటర్) పంచుకున్నారు.
‘‘వృత్తిపరంగా నేను కమెడియన్నే కావచ్చు. సమాజం, రాజకీయాలు, వ్యక్తులు, విలువలపై అన్నింటిపైనా అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. జనసేనకు 24సీట్లు అనగానే అందరూ పవన్ను తిడుతున్నారు. ఒకసారి ఆవేశంతో కాకుండా, ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి. తనని నమ్ముకున్న ప్రజల్ని, తనతో నడుస్తున్న నాయకులను మోసం చేసే వ్యక్తిత్వం పవన్కల్యాణ్గారికి (Pawan Kalyan) ఉంటుందా? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే, ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి ఇంకెంత ఆలోచించి ఉంటాడు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత మథనపడి ఉంటాడు. పదేళ్లుగా ఎలాంటి అవినీతి చేయకుండా, తన సొంత కష్టార్జితంతో పార్టీ నడుపుతున్న గొప్ప వ్యక్తి కల్యాణ్గారు. అలాంటి వ్యక్తి గురించి శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది. 2019లో కనీసం ఆయన్ను అయినా గెలిపించుకోలేని మనకు ఇప్పుడు.. అదేంటి? ఇదేంటి? అని అడిగే హక్కు ఉందా’’
‘‘చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే పదిరోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేము. ఇలాంటి ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి, సమస్య అనగానే రెండోరోజే పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని పరిష్కరించిన గొప్ప మనసు ఆయనది. తన పిల్లల కోసం దాచిన డబ్బులను తీసి, కౌలు రైతుల కష్టాలు తీర్చిన వ్యక్తి గురించా? మనం ఇలా మాట్లాడేది. ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేశారు. దేశ రాజకీయాల్లో ఎవరైనా సరే ‘మేము అధికారంలోకి వస్తే, అది చేస్తాం. ఇది చేస్తాం’ అనేవాళ్లే కానీ, ప్రతిపక్షంలో ఉండగా, వాళ్ల జేబు నుంచి ఒక్క రూపాయి తీసి సహాయం చేశారా? కానీ, పవన్కల్యాణ్ అలా కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకుని, ‘కులాన్ని తాకట్టు పెట్టారు.. పార్టీని తాకట్టు పెట్టారు.. ప్యాకేజీ తీసుకున్నారు’ అని చాలా ఈజీగా అంటున్నాం. డబ్బుకు అమ్ముడుపోతారా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే, అధికార వైకాపా దగ్గరే ఎక్కువగా డబ్బు ఉంటుంది కదా! వాళ్లే కొనుక్కోవచ్చు కదా. ఎందుకండీ ఈ మాటలు. పవన్కల్యాణ్ ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ, నాయకులు పంచే డబ్బులకు బానిస కాదు. అభిమానించడం అంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం.. లేనప్పుడు బై చెప్పడం కాదు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటమే నిజమైన అభిమానం’’
‘‘రెచ్చగొట్టే మాటలు విని మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు. తెదేపా కార్యకర్తలకు కూడా నా విన్నపం. 2014లో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబుగారికి ప్రకటించారు. ఆ త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఐటీని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తిని జైల్లో పెడితే, చాలా మందికి బాధనిపించింది. పవన్ వెళ్లి ఆయన్ను కలిశారు. పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు. కానీ, పవన్ అలా చేయలేదు. కష్టాన్ని చూసి, జైలు బయటకు వచ్చి, ‘కలిసి నడుస్తాం’ అని ప్రకటించారు. ‘అవసరంలో ఆదుకున్నాం కదాని, అనవసరంగా తప్పుగా మాట్లాడొద్ద’ని జనసైనికులకు చెప్పారు. పొత్తు ధర్మాన్ని ఇంత నిజాయతీగా ఎవరూ పాటించరు’’
‘‘ఎక్కువ సీట్లు తీసుకుని, ‘ఇన్నే గెలిచాడా’ అనిపించుకునేకన్నా, తక్కువ తీసుకుని, ‘అన్నీ గెలిచాడు’ అనిపించుకోవాలన్నది ఆయన అభిప్రాయం. తెదేపా కార్యకర్తలు కూడా ఆ 24 సీట్లలో జనసేనకు ఓట్లు బదిలీ అయ్యేలా చూడాలి. మిగిలిన చోట్ల తెదేపాకు జన సైనికులు సహకరించాలి. ధోని వచ్చిన కొత్తలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మంచి షాట్లు కొట్టి 24 పరుగులు చేశాడు. ఇతడిలో గేమ్ ఉందని తెలిసేలా చేశాడు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్, విన్నర్ అయ్యాడు. క్రికెట్ను శాసించాడు. మన నాయకుడు కూడా అంతే. మొదట్లో రెండు చోట్ల ఓడిపోయి ఉండవచ్చు. ఇప్పుడు 24 సీట్లతో అసెంబ్లీకి వెళ్లవచ్చు. ఆయన గేమ్ ఛేంజర్ అవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించవచ్చు’’ అని ఆది ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం