hyper aadi: 2019లో కనీసం ఆయన్ను గెలిపించుకోలేని మనం.. ఇలా అడగొచ్చా: హైపర్ ఆది
hyper aadi: పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు వచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తుండటంపై నటుడు హైపర్ ఆది మాట్లాడారు.
హైదరాబాద్: ‘తెదేపా, జనసేన పొత్తులో భాగంగా పవన్ పార్టీకి 24 సీట్లు అనగానే చాలా మంది ఆయన్ను తిడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన జెండాను కాలితో తొక్కుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనసు బాధగా ఉంద’ని సినీ నటుడు ‘హైపర్’ ఆది (Hyper Aadi) అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పెషల్ వీడియోలో మాట్లాడగా, జనసేన నాయకుడు నాగబాబు తన ఎక్స్లో (ఇంతకు ముందు ట్విటర్) పంచుకున్నారు.
‘‘వృత్తిపరంగా నేను కమెడియన్నే కావచ్చు. సమాజం, రాజకీయాలు, వ్యక్తులు, విలువలపై అన్నింటిపైనా అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. జనసేనకు 24సీట్లు అనగానే అందరూ పవన్ను తిడుతున్నారు. ఒకసారి ఆవేశంతో కాకుండా, ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి. తనని నమ్ముకున్న ప్రజల్ని, తనతో నడుస్తున్న నాయకులను మోసం చేసే వ్యక్తిత్వం పవన్కల్యాణ్గారికి (Pawan Kalyan) ఉంటుందా? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే, ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి ఇంకెంత ఆలోచించి ఉంటాడు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత మథనపడి ఉంటాడు. పదేళ్లుగా ఎలాంటి అవినీతి చేయకుండా, తన సొంత కష్టార్జితంతో పార్టీ నడుపుతున్న గొప్ప వ్యక్తి కల్యాణ్గారు. అలాంటి వ్యక్తి గురించి శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది. 2019లో కనీసం ఆయన్ను అయినా గెలిపించుకోలేని మనకు ఇప్పుడు.. అదేంటి? ఇదేంటి? అని అడిగే హక్కు ఉందా’’
‘‘చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే పదిరోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేము. ఇలాంటి ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి, సమస్య అనగానే రెండోరోజే పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని పరిష్కరించిన గొప్ప మనసు ఆయనది. తన పిల్లల కోసం దాచిన డబ్బులను తీసి, కౌలు రైతుల కష్టాలు తీర్చిన వ్యక్తి గురించా? మనం ఇలా మాట్లాడేది. ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేశారు. దేశ రాజకీయాల్లో ఎవరైనా సరే ‘మేము అధికారంలోకి వస్తే, అది చేస్తాం. ఇది చేస్తాం’ అనేవాళ్లే కానీ, ప్రతిపక్షంలో ఉండగా, వాళ్ల జేబు నుంచి ఒక్క రూపాయి తీసి సహాయం చేశారా? కానీ, పవన్కల్యాణ్ అలా కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకుని, ‘కులాన్ని తాకట్టు పెట్టారు.. పార్టీని తాకట్టు పెట్టారు.. ప్యాకేజీ తీసుకున్నారు’ అని చాలా ఈజీగా అంటున్నాం. డబ్బుకు అమ్ముడుపోతారా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే, అధికార వైకాపా దగ్గరే ఎక్కువగా డబ్బు ఉంటుంది కదా! వాళ్లే కొనుక్కోవచ్చు కదా. ఎందుకండీ ఈ మాటలు. పవన్కల్యాణ్ ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ, నాయకులు పంచే డబ్బులకు బానిస కాదు. అభిమానించడం అంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం.. లేనప్పుడు బై చెప్పడం కాదు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటమే నిజమైన అభిమానం’’
‘‘రెచ్చగొట్టే మాటలు విని మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు. తెదేపా కార్యకర్తలకు కూడా నా విన్నపం. 2014లో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబుగారికి ప్రకటించారు. ఆ త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఐటీని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తిని జైల్లో పెడితే, చాలా మందికి బాధనిపించింది. పవన్ వెళ్లి ఆయన్ను కలిశారు. పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు. కానీ, పవన్ అలా చేయలేదు. కష్టాన్ని చూసి, జైలు బయటకు వచ్చి, ‘కలిసి నడుస్తాం’ అని ప్రకటించారు. ‘అవసరంలో ఆదుకున్నాం కదాని, అనవసరంగా తప్పుగా మాట్లాడొద్ద’ని జనసైనికులకు చెప్పారు. పొత్తు ధర్మాన్ని ఇంత నిజాయతీగా ఎవరూ పాటించరు’’
‘‘ఎక్కువ సీట్లు తీసుకుని, ‘ఇన్నే గెలిచాడా’ అనిపించుకునేకన్నా, తక్కువ తీసుకుని, ‘అన్నీ గెలిచాడు’ అనిపించుకోవాలన్నది ఆయన అభిప్రాయం. తెదేపా కార్యకర్తలు కూడా ఆ 24 సీట్లలో జనసేనకు ఓట్లు బదిలీ అయ్యేలా చూడాలి. మిగిలిన చోట్ల తెదేపాకు జన సైనికులు సహకరించాలి. ధోని వచ్చిన కొత్తలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మంచి షాట్లు కొట్టి 24 పరుగులు చేశాడు. ఇతడిలో గేమ్ ఉందని తెలిసేలా చేశాడు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్, విన్నర్ అయ్యాడు. క్రికెట్ను శాసించాడు. మన నాయకుడు కూడా అంతే. మొదట్లో రెండు చోట్ల ఓడిపోయి ఉండవచ్చు. ఇప్పుడు 24 సీట్లతో అసెంబ్లీకి వెళ్లవచ్చు. ఆయన గేమ్ ఛేంజర్ అవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించవచ్చు’’ అని ఆది ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..