కిస్ సీన్స్ కాంట్రవర్సీ.. స్పందించిన సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ (Animal) ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇందులో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం ‘కబీర్సింగ్’ (Kabir Singh) గురించి ఆయన మాట్లాడారు.
ఇంటర్నెట్డెస్క్: ‘కబీర్సింగ్’ (Kabir Singh)తో తొలి ప్రయత్నంలోనే బాలీవుడ్లో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించిన ముద్దు సీన్స్ అప్పట్లో చర్చకు దారి తీశాయి. ఆ సీన్స్ను పలువురు తప్పుబట్టారు. ఈ విషయంపై ఇటీవల ‘యానిమల్’ ఇంటర్వ్యూలో సందీప్ స్పందించారు. వాళ్ల మాటలను తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు.
‘‘వాళ్ల మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు. ‘కబీర్సింగ్’ మహిళలను తక్కువగా చూపించిన చిత్రం అయితే కాదు. ఐదారుగురు మాత్రమే ఆ సినిమాలోని సన్నివేశాలను తప్పుబట్టారు. వాళ్లే ఏవేవో కథనాలు రాశారు. వాటిని ఆధారంగా చేసుకుని మరి కొందరు వార్తలు సృష్టించారు. అది కేవలం వాళ్ల అభిప్రాయం మాత్రమే’’ అని సందీప్ తెలిపారు. మరోవైపు, ‘కబీర్ సింగ్’లో భాగం కాకపోవడంపై ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ షాలినీపాండే మాట్లాడారు. ‘కబీర్సింగ్’లోకి తనని ఎంచుకోనందుకు తాను ఏమాత్రం బాధపడలేదన్నారు. షాహిద్ - కియారా యాక్టింగ్ తనకెంతో నచ్చిందని చెప్పారు. ‘అర్జున్రెడ్డి’ రీమేక్గా ‘కబీర్సింగ్’ రూపుదిద్దుకుంది. రణ్వీర్ సింగ్తో ఈ సినిమా చేయాలని మొదట సందీప్ భావించారు. కాకపోతే అది కుదరలేదు.
రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
సందీప్ దర్శకత్వం వహించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్తో ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో హీరోయిన్గా తొలుత పరిణీతి చోప్రాను ఎంచుకున్నామని.. లుక్ టెస్ట్ తర్వాత ఆమెను స్థానంలో రష్మికను ఫైనల్ చేశామని ఇటీవల సందీప్ చెప్పారు. ఎన్నో అంచనాల మధ్య తాజాగా ‘యానిమల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్బీర్ కపూర్ యాక్టింగ్.. సందీప్ మార్క్ మేకింగ్కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు.