Priyanka Chopra: ‘టైగర్‌’తో సవాల్‌ ఎదుర్కొన్నా

‘‘ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను గళంలో వినిపించడం ఎంతో సవాలుతో కూడిన పని’’ అంటోంది కథానాయిక ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌, బాలీవుడ్‌లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈమె..

Updated : 22 Apr 2024 12:10 IST

‘‘ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఒక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను గళంలో వినిపించడం ఎంతో సవాలుతో కూడిన పని’’ అంటోంది కథానాయిక ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌, బాలీవుడ్‌లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈమె.. త్వరలో విడుదల కానున్న ‘టైగర్‌’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసిందామె. ‘‘ప్రకృతికి సంబంధించిన సినిమాలకు నేను పెద్ద అభిమానిని. మనదేశం నుంచి వస్తున్న ‘టైగర్‌’ అనే కథను నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నేను ఒక నటిగా ఆడియో విజువల్‌ మాధ్యమానికి అలవాటు పడ్డాను. కానీ.. ఇప్పుడు కేవలం నా వాయిస్‌తోనే భావోద్వేగాలను పండించగలగాలి. తొలిసారి ఓ సరికొత్త పాత్రతో రాబోతున్నాను. నిజంగా ఇది సవాలుతో కూడిన పని. గళాన్ని అందించాలనే నా కోరిక ‘టైగర్‌’తో నెరవేరింద’’ని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఒక పులి ఎనిమిదేళ్ల జీవితం ఆధారంగా రాబోతున్న ‘టైగర్‌’ ఈ నెల 22న రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని