Kartikeya: నేను చూసిన హీరోయిజం అదే!
‘‘కథానాయకుడి పాత్రకైనా, సినిమాకైనా సామాజిక బాధ్యత ఉండాల్సిందే అని బలంగా నమ్ముతా. అందుకు తగ్గ కథల్నే నేను ఎంచుకుంటున్నా’’ అన్నారు కార్తికేయ గుమ్మకొండ
‘‘కథానాయకుడి పాత్రకైనా, సినిమాకైనా సామాజిక బాధ్యత ఉండాల్సిందే అని బలంగా నమ్ముతా. అందుకు తగ్గ కథల్నే నేను ఎంచుకుంటున్నా’’ అన్నారు కార్తికేయ గుమ్మకొండ. ఆయన కథానాయకుడిగా ‘భజే వాయు వేగం’ సినిమా రూపొందింది. యు.వి.కాన్సెప్ట్స్ పతాకంపై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన కబుర్లు..
ఇందులో క్రికెటర్గా పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
నేను గల్లీ క్రికెట్ ఆడటమే తప్ప, మైదానానికి వెళ్లి సీరియస్గా ఎప్పుడూ ఆడలేదు. అందుకే ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించాలనగానే శిక్షణ తీసుకున్నా.
ఈ కథలో నచ్చిన అంశం ఏమిటి?
తెరపై కనిపించే హీరో మనలో ఒకడు అన్నట్టుగానే కనిపించాలి. తను ఎదుర్కొనే సమస్యలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అలాంటి హీరోయిజమే ఇందులో ఉంటుంది తప్ప, సూపర్మేన్ అన్నట్టుగా కనిపించడు. హీరోయిజం, యాక్షన్, భావోద్వేగాలు, ప్రేమ... ఇలా అన్నీ కుదిరిన కథ ఇది. కెరీర్ కోసం లేదంటే తండ్రి కోసం, నచ్చిన అమ్మాయి కోసం ఓ సాధారణ యువకుడు ఎంచుకున్న మార్గం ఏమిటనే విషయంపై హీరోయిజం ఆధారపడి వుంటుంది. అది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటే హీరో అంతగా నచ్చుతాడు. అలాంటి హీరోయిజం ఇందులో కీలకం. ఇప్పుడున్న నా ఇమేజ్కి సరైన సినిమా ఇది.
ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం..?
కరోనా సమయంలోనే ఈ కథ విన్నా. ‘బెదురులంక’ చేస్తున్నప్పుడే ఈ సినిమాని పట్టాలెక్కించాం. వేగంగా పూర్తి చేయాలనుకున్నాం. కానీ కొన్నాళ్లు చిత్రీకరణ చేశాక... ఇంత బాగా వస్తుంది కదా, కొంచెం సమయం తీసుకుని ఇంకా బాగా చేద్దామనుకున్నా. ‘బెదురులంక’ తర్వాత పూర్తిగా ఈ సినిమాపై దృష్టిపెట్టా. దర్శకుడు ఈ కథ చెప్పాక నాకు, కార్తీ ‘ఖైదీ’ సినిమా గుర్తొచ్చింది. అంత యాక్షన్ ఇందులో ఉండదు కానీ, అంతకంటే ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి.
పేరున్న నిర్మాణ సంస్థల్లో సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
నిర్మాణం, విడుదల అన్నీ పక్కాగా ఉంటాయనే నమ్మకం ఉంటుంది. యు.వి.కాన్సెప్ట్స్లో సినిమా అనగానే నాకొక పెద్ద సంస్థ దొరికిందని సంతోషించా. వీళ్ల నిర్మాణం కూడా చాలా క్లాస్గా ఉంటుంది. కథ కోసం ఏం చేయడానికైనా వెనకాడకుండా ‘భజే వాయు వేగం’ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది యు.వి.కాన్సెప్ట్స్ సంస్థ.
నేను కామెడీ చేశానా? యాక్షన్ చేశానా? అనేది కాదు... సినిమా ఎంత బాగుందనేదే కీలకం. స్క్రీన్ప్లే, మేకింగ్ తదితర విషయాలు సినిమాలపై ప్రభావం చూపిస్తాయి. కామెడీనా, యాక్షనా అనే విషయాల కంటే కూడా, కథలు, పాత్రల ఎంపికలో నాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. తెరపై కనిపించే కథానాయకుడిని చూస్తే అలా మనం ఉండాలనిపించేలా స్ఫూర్తిని పంచాలి. అదే నేను చూసిన హీరోయిజం, అదే నేను కావాలనుకున్న హీరోని’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం