Chiranjeevi: 34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.. నెటిజన్ల కామెంటిదే!

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో నటించిన చైల్డ్‌ ఆర్టిస్టులు చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 

Published : 07 Jun 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’. ఈ సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్‌ మీడియాలో దీని డైలాగ్స్, పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుతో కలిసి షాలిని, షామిలి, రిషి చైల్డ్‌ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు. వాళ్లు తాజాగా మెగాస్టార్‌ని కలిశారు. ఆ ఫొటోను షామిలి ఇన్‌స్టాలో పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సెట్‌లో చిరంజీవితో (Chiranjeevi) కలిసి దిగిన ఫొటోతో పాటు తాజాగా దిగిన దాన్ని కలిపి షేర్‌ చేశారు. అది చూసిన అభిమానులు ‘శ్రీదేవి ఉంటే ఇంకా బాగుండేది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

మోదీతో అకీరా.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన రేణూదేశాయ్‌

ఇక ఈ ముగ్గురిలో షామిలి, షాలిని చైల్డ్‌ ఆర్టిస్టులుగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. షాలిని హీరోయిన్‌గా నటించిన ‘సఖి’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే షామిలి ‘ఓయ్‌’ చిత్రంలో కథానాయికగా చేసి అలరించారు. రిషి కూడా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో ‘ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌’, ‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’లో కనిపించారు. చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ (Vishwambhara)తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా తెరకెక్కుతుంది. త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని