Janhvi kapoor: ఆ తప్పు ఇప్పటికీ బాధిస్తోంది
‘ఆ కారణంతోనే నా తొలి సినిమా ‘ధడక్’ సెట్స్కి అమ్మని రావొద్దని చెప్పాను’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్.
‘ఆ కారణంతోనే నా తొలి సినిమా ‘ధడక్’ సెట్స్కి అమ్మని రావొద్దని చెప్పాను’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్. ఈ ఏడాది ‘బవాల్’తో అలరించిన జాన్వీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లిని గుర్తుచేసుకుంది. ‘శ్రీదేవి కుమార్తె కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకే అమ్మను నా తొలి సినిమా చిత్రీకరణ సమయంలో దూరం పెట్టాను. సెట్స్కి కూడా రావొద్దని చెప్పా. శ్రీదేవి కుమార్తె అనే గుర్తింపుతో చిత్రసీమకు పరిచయమయ్యానని అనడంతో అభద్రతా భావానికి లోనయ్యేదాన్ని. తన సలహాలు కూడా తీసుకొవద్దనుకున్నా. అంత మూర్ఖంగా ఎందుకు ఆలోచించానా అని ఇప్పుడు అనిపిస్తోంది. అమ్మ విషయంలో చేసిన ఆ తప్పు ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. కానీ ఇప్పుడు ఆమె వారసురాలినైనందుకు ఎంతో గర్వపడుతున్నా. శ్రీదేవి తనయ జాన్వీ అని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’ అంటూ తెలిపింది. ప్రస్తుతం జాన్వీ ‘దేవర’ చిత్రీకరణలో బిజీగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.