Janhvi kapoor: ఆ తప్పు ఇప్పటికీ బాధిస్తోంది

‘ఆ కారణంతోనే నా తొలి సినిమా ‘ధడక్‌’ సెట్స్‌కి అమ్మని రావొద్దని చెప్పాను’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌.

Updated : 16 Dec 2023 09:28 IST

‘ఆ కారణంతోనే నా తొలి సినిమా ‘ధడక్‌’ సెట్స్‌కి అమ్మని రావొద్దని చెప్పాను’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌. ఈ ఏడాది ‘బవాల్‌’తో అలరించిన జాన్వీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తల్లిని గుర్తుచేసుకుంది. ‘శ్రీదేవి కుమార్తె కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకే అమ్మను నా తొలి సినిమా చిత్రీకరణ సమయంలో దూరం పెట్టాను. సెట్స్‌కి కూడా రావొద్దని చెప్పా. శ్రీదేవి కుమార్తె అనే గుర్తింపుతో చిత్రసీమకు పరిచయమయ్యానని అనడంతో అభద్రతా భావానికి లోనయ్యేదాన్ని. తన సలహాలు కూడా తీసుకొవద్దనుకున్నా. అంత మూర్ఖంగా ఎందుకు ఆలోచించానా అని ఇప్పుడు అనిపిస్తోంది. అమ్మ విషయంలో చేసిన ఆ తప్పు ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. కానీ ఇప్పుడు ఆమె వారసురాలినైనందుకు ఎంతో గర్వపడుతున్నా. శ్రీదేవి తనయ జాన్వీ అని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’ అంటూ తెలిపింది. ప్రస్తుతం జాన్వీ ‘దేవర’ చిత్రీకరణలో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని