Mr And Mrs Mahi : ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మ్యాజికల్ స్టోరీ ఆలస్యం
బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’.
బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ఈ చిత్రాన్ని శరణ్ శర్మ తెరకెక్కిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 15న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరికొంత కాలం ఆగాల్సిందే. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు నిర్మాత కరణ్ జోహార్. ‘ఇదొక మ్యాజికల్ స్టోరీ.. పిచ్పర్ఫెక్ట్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 19న రాబోతుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
బొల్లా జీవిత ప్రయాణం వచ్చే ఏడాది
దృష్టి లోపం ఉన్నప్పటికీ తన కలలను నెరవేర్చుకొని బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీ’. బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తుషార్ హీరానందాని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జ్యోతిక, అలయ ఎఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్రబృందం. ‘ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాంత్ బొల్లా జీవిత ప్రయాణంను వచ్చే ఏడాది మే 10న చూడడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..