Mr And Mrs Mahi : ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ మ్యాజికల్‌ స్టోరీ ఆలస్యం

బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’.

Updated : 11 Nov 2023 13:56 IST

బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. ఈ చిత్రాన్ని శరణ్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 15న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరికొంత కాలం ఆగాల్సిందే. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు నిర్మాత కరణ్‌ జోహార్‌. ‘ఇదొక మ్యాజికల్‌ స్టోరీ.. పిచ్‌పర్‌ఫెక్ట్‌.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 19న రాబోతుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

బొల్లా జీవిత ప్రయాణం వచ్చే ఏడాది

దృష్టి లోపం ఉన్నప్పటికీ తన కలలను నెరవేర్చుకొని బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ స్థాపించిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీ’. బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌ ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. తుషార్‌ హీరానందాని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జ్యోతిక, అలయ ఎఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్రబృందం. ‘ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాంత్‌ బొల్లా జీవిత ప్రయాణంను వచ్చే ఏడాది మే 10న చూడడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని