Karthikeya: వాయు వేగంతో వస్తోన్న కార్తికేయ

‘బెదురులంక’తో గతేడాది ప్రేక్షకుల్ని అలరించారు కార్తికేయ. ఇప్పుడాయన యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 13 Apr 2024 11:52 IST

‘బెదురులంక’తో గతేడాది ప్రేక్షకుల్ని అలరించారు కార్తికేయ. ఇప్పుడాయన యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘భజే వాయు వేగం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను హీరో మహేశ్‌బాబు శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో కార్తికేయ క్రికెట్‌ బ్యాట్‌తో పరుగులు పెట్టడం.. మరోవైపు వేగంగా దూసుకొస్తున్న కారు డిక్కీలో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గాల్లోకి ఎగరడం ఆసక్తి రేకెత్తించింది. దీన్ని బట్టి ఇదొక భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో అందర్నీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రధన్‌ సంగీత దర్శకుడు. ఆర్‌.డి.రాజశేఖర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని