Katrina Kaif: అదే కాంబో కొత్త చిత్రం?

‘బూమ్‌’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్‌ నాయిక కత్రినా కైఫ్‌. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా.

Updated : 28 Mar 2024 12:21 IST

‘బూమ్‌’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్‌ నాయిక కత్రినా కైఫ్‌. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. ఎన్నో ప్రేమకథలు, యాక్షన్‌ చిత్రాలతో అభిమానులను మెప్పించిన ఈ సుందరి ఈ ఏడాది ‘మేరి క్రిస్మస్‌’తో మెరిసింది. తాజాగా ఈ భామ హిందీ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌తో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మేరే బ్రదర్‌ కీ దుల్హన్‌’, ‘టైగర్‌ జిందా హై’, ‘భారత్‌’ లాంటి చిత్రాలు అభిమానులను అలరించాయి. ఇప్పుడిదే కాంబినేషన్‌లో కొత్త చిత్రం రానుందన్న విషయం సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తోంది. అలీ అబ్బాస్‌ తనకి మంచి స్నేహితుడని, భిన్నమైన కథల గురించి ఎప్పుడూ చర్చించుకుంటామని, తన సినిమాలు విభిన్నంగా ఉంటాయని గతంలో కత్రినా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి ఈ కొత్త ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని