NTR: ఎన్టీఆర్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా ఆ సీక్వెల్‌ చేస్తా: కోన వెంకట్‌

అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్‌ నిర్మించిన హారర్‌ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 03 Apr 2024 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) ద్విపాత్రాభినయంలో నటించిన యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అదుర్స్‌’ (Adhurs). కోన వెంకట్‌ కథ అందించగా వి.వి.వినాయక్‌ తెరకెక్కించారు. దాదాపు పద్నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌.. చారి పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన కామెడీ టైమింగ్‌కు సినీప్రియులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోని ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సీక్వెల్‌ను ఉద్దేశించి కోన వెంకట్ తాజాగా స్పందించారు. తారక్‌తో తప్పకుండా ‘అదుర్స్‌ 2’ చేస్తానని చెప్పారు.

‘‘గతంలో మీరు వర్క్‌ చేసిన ‘వెంకీ’ చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది. మీరేమైనా వర్క్ చేస్తున్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘వెంకీ 2’ గురించి చెప్పలేను. కానీ, ‘అదుర్స్‌ 2’ మాత్రం పక్కా చేయాలని ఉంది. తారక్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే ఆయనతో ఈ సినిమా చేయిస్తా. ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీల్లో ఇదీ ఒకటి. చారి పాత్రకు ఆయన తప్ప వేరొకరు న్యాయం చేయలేరు. వినాయక్‌తోనే సీక్వెల్‌ కూడా చేస్తా’’ అని కోన వెంకట్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని