Kriti Sanon: అందుకే ‘లస్ట్ స్టోరీస్‌’ ఆఫర్‌ తిరస్కరించా: కృతి సనన్‌

బోల్డ్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా ‘లస్ట్‌ స్టోరీస్‌’కు నో చెప్పినట్లు కృతి సనన్‌ గతంలో ఓ సందర్భంలో చెప్పారు.

Published : 21 Mar 2024 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీనేపథ్యం లేకపోయినా కృతి సనన్‌ (Kriti Sanon) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆకట్టుకుంటూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. బోల్డ్‌ సన్నివేశాలు ఉన్నందున కరణ్ జోహార్‌ దర్శకత్వం వహించిన ‘లస్ట్ స్టోరీస్‌’ను తిరస్కరించినట్లు గతంలో ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. 

‘‘లస్ట్ స్టోరీస్‌’ ఆఫర్‌ నావద్దకు వచ్చినప్పుడు నేను మా అమ్మ సలహా అడిగాను. ఆ స్క్రిప్ట్‌ ఆమెకు నచ్చలేదు. అందుకే నో చెప్పమంది. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. వివాదాస్పద అంశాలు, బోల్డ్‌ సన్నివేశాలు ఉన్న వాటిల్లో నటించే ధైర్యం చేయను. ఒకవేళ కరణ్‌ మా అమ్మను ఒప్పించి ఉంటే నేను నటించేదాన్నేమో’ అన్నారు. ఇక ఇదే విషయంపై కృతి తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అలాంటి సిరీస్‌ల్లో నటిస్తే దాని ప్రభావం కెరీర్‌పై పడుతుందని, అందుకే నో చెప్పమన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం కృతి ‘దో పత్తీ’(Do Patti) పనుల్లో బిజీగా ఉన్నారు. ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించనున్న మొదటి సినిమా ఇది. దీనితో పాటు ‘ది క్రూ’లోను నటిస్తున్నారు. బాలీవుడ్‌లోని అందాల తారలు టబు, కృతిసనన్‌, కరీనాకపూర్‌ కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. కామెడీ నేపథ్యంలో రాజేశ్‌ కృష్ణన్‌ తెరకెక్కిస్తున్నారు. మార్చి 29న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని