Chiranjeevi: చిరు.. పోరు

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది.

Updated : 03 Apr 2024 14:03 IST

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. దీనిలో భాగంగా చిరుపై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాట ఘట్టానికి రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ నేతృత్వం వహిస్తున్నారు. సినిమాలో ఓ కీలక సందర్భంలో వచ్చే ఈ ఫైట్‌ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. వినూత్నమైన సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని