Mama mascheendra: ‘మామా’.. మహేశ్‌బాబులా పరిగెడుతుంది!

‘‘మామా మశ్చీంద్ర’లో ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. సినిమా కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కథానాయకుడు సుధీర్‌బాబు.

Updated : 04 Oct 2023 14:07 IST

‘‘మామా మశ్చీంద్ర’లో ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. సినిమా కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కథానాయకుడు సుధీర్‌బాబు. ఆయన తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రమే ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్‌ తెరకెక్కించారు. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మించారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరోలు శర్వానంద్‌, శ్రీవిష్ణు, విష్వక్‌ సేన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ చిత్రంలో మంచి ప్రేమకథ ఉంది. అనుబంధాలున్నాయి. ఒక అమ్మ కథ, తండ్రీకూతుళ్ల కథ ఉంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణతో ఒక సీన్‌ చేయించాలనుకున్నాం. దురదృష్టవశాత్తూ ఆయన వెళ్లిపోయారు. అదొక్క అసంతృప్తి తప్ప మిగతావన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి’’ అన్నారు చిత్ర దర్శకుడు హర్ష. ‘‘మంచి సినిమా చేశాం. దీంట్లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. సినిమా మహేశ్‌బాబులా పరిగెడుతుంది’’ అన్నారు సుధీర్‌బాబు. ఈ కార్యక్రమంలో  రామ్‌ అబ్బరాజు, ఈషా, మృణాళిని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని