Manjummel Boys: భావోద్వేగభరిత సర్వైవల్‌ థ్రిల్లర్‌

మలయాళంలో విజయవంతమైన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని చిదంబరం ఎస్‌ పొదువల్‌ తెరకెక్కించారు.

Updated : 01 Apr 2024 12:04 IST

లయాళంలో విజయవంతమైన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని చిదంబరం ఎస్‌ పొదువల్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 6న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. కొడైకెనాల్‌లోని గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించడం కోసం ఎర్నాకులం మంజుమ్మల్‌ బాయ్స్‌ చేసిన సాహసోపేతమైన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఈ ఇతివృత్తాన్ని ట్రైలర్‌లో ఉత్కంఠభరితంగా చూపించారు. ప్రధాన పాత్రల మధ్య స్నేహాన్ని చూపిస్తూ ప్రచార చిత్రం ఆసక్తికరంగా మొదలైంది. వారిలో ఒకరు గుహలోని లోతైన గుంటలో పడిపోవడం.. అతన్ని రక్షించేందుకు తోటి మిత్రులంతా ప్రయత్నాలు ప్రారంభించడం.. ఈ క్రమంలో ప్రభుత్వ బృందాలు రంగంలోకి దిగడం.. వారికి ఎదురయ్యే సవాళ్లతో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇదొక భావోద్వేగభరితమైన సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: సుశీన్‌ శ్యామ్‌, ఛాయాగ్రహణం: షైజు ఖలీద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని