Manoj Manchu: పవన్‌కల్యాణ్‌ మూవీ పేరుతో మంచు మనోజ్‌ కొత్త షో..!

Manoj Manchu: ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా అలరించేందుకు మంచు మనోజ్‌ సిద్ధమయ్యారు

Published : 29 Nov 2023 19:01 IST

హైదరాబాద్‌: సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన సినీ నటుడు మంచు మనోజ్‌ (Manoj Manchu) మళ్లీ ట్రాక్‌ ఎక్కారు. ఇప్పటికే ఆయన కథానాయకుడిగా ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రం తెరకెక్కుతోంది. మనం మనం.. బరంపురం అనేది ఉప శీర్షిక. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ఓ సరికొత్త షో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన టైటిల్‌ను బుధవారం ప్రకటించారు. ‘ఉస్తాద్‌’ (Ustaad) అనే సరికొత్త షోతో మంచు మనోజ్‌ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ షో పూర్తి వివరాలు ఏంటి? ఎలా సాగుతుంది? తదితర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని