Pushpa2: హెడ్ఫోన్స్ రెడీ చేసుకోండి.. ‘పుష్ప2’ మోత మోగిపోవడమే ఇక..!
Pushpa2 update: అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’కు సంబంధించి మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్నాయి.
హైదరాబాద్: అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: ది రూల్’. ‘పుష్ప1’కు కొనసాగింపుగా రాబోతున్న ఈ మూవీ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పని పూర్తి కాగా, దానికి తన నేపథ్య సంగీతంతో డబుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ఫొటోను పంచుకుంది. సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి దిగిన ఈ ఫొటోకు ‘హెడ్ఫోన్స్ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ టీజర్కు సెన్సేషనల్ బీజీఎం రాబోతోంది’ అని పేర్కొంది.
‘పుష్ప-1’లో పాటలు ఏ స్థాయిలో హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. సామాన్యుల దగ్గరి నుంచి క్రికెటర్లు వరకూ అందరూ రీల్స్తో హోరోత్తించారు. ఇప్పుడు అంతకుమించిన మ్యూజిక్ ఆల్బమ్ను ఇచ్చేందుకు దేవిశ్రీ సిద్ధమవుతున్నారు. టీజర్కు నేపథ్య సంగీతం అందించడంతో పాటు, సినిమాలోని పాటలకు సంబంధించిన ఫైనల్ వెర్షన్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా సుకుమార్, అల్లు అర్జున్ మ్యూజిక్ సెషన్స్లో పాల్గొన్నారు. సుకుమార్, దేవిశ్రీ కాంబోలో ఐటమ్ సాంగ్ అదిరిపోవాల్సిందే. ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావ’తో ఓ ఊపు ఊపేశారు. దానికి దీటుగా ఉండేలా దేవిశ్రీ ట్యూన్స్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులోనూ సమంత చిందేస్తారని కొన్నిరోజుల కిందట టాక్ వినిపించింది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండటంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.
మే చివరి నాటికి ‘పుష్ప2’ చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అల్లు అర్జున్ తన పోర్షన్ కంప్లీట్ చేసి, తర్వాతి ప్రాజెక్ట్కు సిద్ధమవుతారని అంటున్నారు. ‘పుష్ప1’ ప్రమోషన్స్ కోసం చివరి నిమిషం వరకూ టీమ్ కష్టపడింది. ఈసారి పూర్తి సమయాన్ని ప్రమోషన్స్ కేటాయించాలని భావిస్తోంది. అందుకు తగిన షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుఫాన్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు.