Oscars 2023: నాటు నాటు... ఆస్కార్ పట్టు
నాటు నాటు (Naatu Naatu) పాట దేశానికి ఆస్కార్ తీసుకురావాలని దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఆస్కార్ (Oscars 2023) అనేది సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నం.
నాటు నాటు (Naatu Naatu) పాట దేశానికి ఆస్కార్ తీసుకురావాలని దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఆస్కార్ (Oscars 2023) అనేది సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నం. ఆ కల సాకారానికి అతి దగ్గరలో ఉంది ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రబృందం. ‘నాటు నాటు’ పాటకు మన ప్రేక్షకులే కాదు... విదేశాల్లోనూ ఈ పాట చూస్తూ సీట్లలో నుంచి లేచి ఆడిపాడుతున్నారు. అంతగా ఊపేసిన ఈ పాట అంతర్జాతీయ పురస్కారాల్లో తొలి నుంచీ ఫేవరేట్గా నిలుస్తూ వచ్చింది. ఆస్కార్ అవార్డుల నామినేషన్లను భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం అమెరికాలోని కాలిఫోర్నియాలో అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్ల కిందటే ఆస్కార్ పురస్కారాల్లో 15 పాటల తుది జాబితాకి ఎంపికైన ఈ పాట, చివరి ఐదు పాటల్లో ఓ నామినేషన్ని కైవశం చేసుకుని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ‘టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్’ చిత్రంలోని అప్లాజ్..., ‘టాప్ గన్: మేవరిక్’లో హోల్డ్ మై హ్యాండ్..., ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ చిత్రంలోని లిఫ్ట్ మి అప్.., ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని దిస్ ఈజ్ఎ లైఫ్.. పాటలతో తుది అంకంలో పోటీ పడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్లని సొంతం చేసుకున్న తొలి భారతీయ గీతం ఇదే. ఇదివరకు ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లోని జై హో... పాటకి ఉత్తమ స్కోర్ విభాగంలో ఆస్కార్ని దక్కించుకున్నారు. కానీ అది భారతీయ నేపథ్యం ఉన్న కథే అయినా, ఆ చిత్రం మాత్రం బ్రిటిష్ రూపకర్తల నిర్మాణంలో రూపుదిద్దుకుంది. అందుకే ‘నాటు నాటు...’ ఆస్కార్ గెలిస్తే మాత్రం తొలి భారతీయ గీతంగా చరిత్రని సృష్టిస్తుంది. ‘లగాన్’ తర్వాత నామినేషన్ దక్కించుకున్న భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఉత్తమ నటుడుతోపాటు, ఇతర మరికొన్ని విభాగాల్లోనూ నామినేషన్లు దక్కుతాయని ఆశించారు ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు. కానీ ఆ కల నెరవేరలేదు. అయితే ఆస్కార్ 95 పురస్కారాల కోసం రూపొందించిన ప్రోమోలో ‘ఆర్ఆర్ఆర్’కు చోటు దక్కడం విశేషం.
తొలి భారతీయ డాక్యుమెంటరీ
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత నేపథ్యంతో రూపొందిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘ఆల్ దట్ బ్రెత్స్’ (All That Breathes) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. దీన్ని శౌనక్ సేన్ తెరకెక్కించారు. దిల్లీకి చెందిన ప్రకృతి ప్రేమికులైన మహ్మద్ సాద్, నదీం షెహ్జాద్ జీవితాల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందింది. గాయపడ్డ పక్షులకు సపర్యలు చేయడం, వాటిని రక్షించడం కోసం ఈ సోదరులిద్దరూ తమ జీవితాన్నే కేటాయించారు. ఈ డాక్యుమెంటరీ గతంలో ప్రఖ్యాత బాఫ్టా అవార్డుకు సైతం నామినేట్ అయ్యింది. ‘ఆల్ దట్ బ్రెత్స్’ అకాడెమీ అవార్డుకి నామినేట్ అయిన తొలి భారతీయ డాక్యుమెంటరీ.
* భారతీయ డాక్యుమెంటరీ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగానికి నామినేట్ అయింది. 41 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ఫిల్మ్కి కార్తీకి గోంజాల్వ్స్ దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు. ప్రధాన అవార్డు కోసం ఇది మరో పద్నాలుగు డాక్యుమెంటరీలతో పోటీ పడనుంది.
మాకు.. దేశానికీ గర్వకారణం
నాటు నాటు పాటకి ఆస్కార్ నామినేషన్ దక్కడంతో భారతీయ సినీ, రాజకీయ, ప్రేక్షక వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలువురు ప్రముఖులు సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ బృందాన్ని అభినందించారు. తమ పాటకి పురస్కారం దక్కిందని తెలియగానే సినీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సినిమాలో కొమురం భీమ్గా నటించిన ఎన్టీఆర్ (NTR) ట్విటర్ ద్వారా స్పందిస్తూ ... ‘‘ఈ పాటకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకస్థానమే. ఆస్కార్ నామినేషన్ మరో చిరస్మరణీయ ఘనత’’ అంటూ బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఎంత అద్భుతమైన వార్త. నాటు నాటు’ ఆస్కార్కి నామినేట్ కావడం గౌరవంగా భావిస్తున్నా. మాకు, భారతదేశానికి గర్వకారణమైన క్షణం. సోదరుడు ఎన్టీఆర్కి, రాజమౌళికి, కీరవాణి, మొత్తం సినీ బృందానికి నా అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు మరో కథానాయకుడు, అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్చరణ్. నాటు నాటు పాటకోసం పనిచేసిన వారందరికీ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి (Rajamouli). ఆయన ఈ సందర్భంగా నామినేషన్ దక్కించుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభినందించారు.
11 నామినేషన్లతో ‘ఎవ్రీథింగ్...’ హవా
95వ అకాడెమీ అవార్డుల నామినేషన్లలో అత్యధికంగా 11 నామినేషన్లతో దుమ్ము రేపింది ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం. ఆ తర్వాత ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రాలు తొమ్మిదేసి నామినేషన్లు దక్కించుకున్నాయి. ఎల్విస్ చిత్రానికి ఎనిమిది నామినేషన్లు దక్కాయి. మార్చి 12న ఆస్కార పురస్కారాల వేడుక జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ (Animal) గురించి స్పందించారు నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆ చిత్రంపై వచ్చిన విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. -
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత