Nani: ‘దసరా’ మూవీ కోసం అంత ఖర్చుతో భారీ సెట్?
యువ కథానాయకుడు నాని(Nani) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబరులో ‘శ్యామ్ సింగరాయ్’తో మెప్పించిన ఆయన ఇటీవలే
హైదరాబాద్: యువ కథానాయకుడు నాని(Nani) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబరులో ‘శ్యామ్ సింగరాయ్’తో మెప్పించిన ఆయన ఇటీవలే ‘సుందరానికి తొందరెక్కువ’ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మరో సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న 29వ చిత్రం ‘దసరా’. కీర్తిసురేశ్ కథానాయిక. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ కథలో నాని డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా విలేజ్ సెట్ను తీర్చిదిద్దుతోందట. ఇందుకోసం ఏకంగా రూ.12కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాలీవుడ్ టాక్. మెజార్టీ భాగం ఇక్కడే చిత్రీకరించనున్నారు. దీంతో ఈ విషయంలో చిత్ర బృందం అస్సలు రాజీపడకూడదని భావిస్తోందట. ‘శ్యామ్ సింగరాయ్’ కోసం కోల్కతాను తలపించేలా సెట్ను తీర్చిదిద్దిన ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్ల దీనికి పనిచేస్తున్నారు. గోదావరిఖని మైన్స్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే సెట్ను రూపొందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం