Nayanthara: గోల్డ్‌ వచ్చే నెల్లో

పృథ్విరాజ్‌ సుకుమారన్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘గోల్డ్‌’. ఆల్ఫోన్స్‌ పుతేరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది.

Updated : 17 Nov 2022 06:50 IST

పృథ్విరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran), నయనతార (Nayanthara) జంటగా నటించిన చిత్రం ‘గోల్డ్‌’ (Gold). ఆల్ఫోన్స్‌ పుతేరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాని థియేటర్లలో వచ్చే నెల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మొబైల్‌ షాపు యజమాని కొన్న కారు చుట్టూ తిరిగే కథతో సాగుతుంది. ‘ప్రేమమ్‌’ లాంటి చిత్రాలతో విజయాలు అందుకున్న ఆల్ఫోన్స్‌ నుంచి వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని