Cinema News: కొత్త సినిమా ముచ్చట్లు
అజయ్ దేవ్గణ్ స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా’. ఇది తమిళ సినిమా ‘ఖైదీ’కి రీమేక్.
ఒక్క పదునైన శిల.. వందమంది రాక్షసులు
అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా’ (Bholaa). ఇది తమిళ సినిమా ‘ఖైదీ’కి రీమేక్. తబు (Tabu) కీలక భూమిక పోషిస్తున్నారు. మంగళవారం చిత్ర రెండో ట్రైలర్ విడుదల చేశారు. ఖైదీగా ఉంటూ తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు.. పోలీసులకు సాయ పడుతూ దుష్టులను దనుమాడేలా హీరోయిజం ప్రదర్శించాడు. ఇందులోని పోరాట సన్నివేశాలు భీతి గొలిపేలా ఉన్నాయి. పోలీసు అధికారిగా టబు తనదైన స్టైల్లో మెప్పించారు. ఈ టీజర్ని అజయ్ దేవ్గణ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘ఒక పదునైన శిల.. వందమంది రాక్షసులతో తలపడితే ఎలా ఉంటుందో ఈ టీజర్’ అని ట్వీట్ చేశారు. ‘భోళా’ మార్చి 30న విడుదలవుతోంది.
రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో..: సీనియర్ నటుడు అజయ్ దేవ్గణ్, దర్శకుడు నీరజ్ పాండే కలయికలో కొత్త సినిమా పట్టాలెక్కనుందని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందనీ, రెండు భిన్న కాలాలకు సంబంధించి ఉంటుందని మంగళవారం వివరాలు ప్రకటించారు. ‘1990ల నాటి నేపథ్యంతో కథ మొదలవుతుంది. ప్రస్తుత కాలంలో కీలక సన్నివేశాలతో ముగుస్తుంది. అజయ్ దేవ్గణ్కి జోడీగా సయీ మంజ్రేకర్, తబులు నటించనున్నారు’ అని పేర్కొన్నారు. త్వరలోనే లఖ్నవూలో షూటింగ్ మొదలు కానున్నట్టు చిత్రబృందం తెలిపింది.
‘కబ్జా’ ఎప్పుడంటే?
ఉపేంద్ర (Upendra) కథానాయకుడిగా... శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ప్రైజెస్ పతాకంపై రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘కబ్జా’ (Kabza). శివ రాజ్కుమార్, శ్రియ శరణ్, కిచ్చా సుదీప్ కీలక పాత్రలు పోషించారు. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.టి.బి.నాగరాజ్ సమర్పకులు. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా మార్చ్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. ‘‘కన్నడ నుంచి ‘కె.జి.ఎఫ్’, ‘777 చార్లి’, ‘విక్రాంత్రోణ’, ‘కాంతార’ వంటి పాన్ ఇండియా చిత్రాలొచ్చి సంచలన విజయం సాధించాయి. ఆ కోవలో రూపొందిన మరో చిత్రమే ‘కబ్జా’. గ్యాంగ్స్టర్ డ్రామాగా 1947 నుంచి 1984 కాలం నేపథ్యంలో సాగే కథ ఇది. స్వాతంత్య్ర సమరయోధుడి కొడుకు మాఫియా ప్రపంచంలో ఎలా చిక్కుకున్నాడు? అతను ఏ స్థాయికి చేరాడన్నది ఈ కథలో కీలకం’’ అని సినీ వర్గాలు తెలిపాయి. జగపతిబాబు, ప్రకాష్రాజ్, సముద్రఖని, మురళీశర్మ, నవాబ్ షా, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్.
ఉద్యమ ‘సిందూరం’
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘సిందూరం’ (Sindhooram). శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మాత. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ ‘‘చరిత్రలో నిక్షిప్తమైన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. నక్సల్స్ ఉద్యమం, ప్రేమ పోరాటం, రాజకీయం మేళవింపుగా సాగుతుంది. ఒక నిజాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతున్నామ’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి సినిమా తీశామనే తృప్తి ఉంది. అందరికీ మంచి పేరు తీసుకొచ్చే ఓ మంచి చిత్రం ఇది’’ అన్నారు. నటుడు శివబాలాజీ మాట్లాడుతూ ‘‘దర్శకుడు బాగా పరిశోధన చేసి ఈ కథ రాసుకున్నారు. నేను తొలిసారి నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నా’’ అన్నారు.
ఒక సినిమా.. పది కథలు!
‘‘కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’’ (Valentines Night) అన్నారు నటుడు చైతన్యరావు మదాడి. ఆయన.. సునీల్, లావణ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించారు. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ నారల నిర్మించారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో చైతన్యరావు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అనిల్ ఈ చిత్రాన్ని చాలా కొత్తగా తెరకెక్కించారు. ఇందులో చాలా జానర్స్ ఉన్నాయి. ఒకే సినిమాలో దాదాపు పది కథలు చూడొచ్చు. ఒక కథకు మరో కథకు అద్భుతమైన సంబంధం ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇందులో ప్రేమ, రొమాన్స్, టీనేజ్ లైఫ్.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు అనిల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా