ETV win: నేడు ఈటీవీ విన్‌లో రెండు సినిమాలు

రజిషా విజయన్‌ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘కీడం’. 2022లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘కీచురాళ్ళు’ పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో నేడు (మే 30)న విడుదలవుతోంది.

Published : 30 May 2024 02:12 IST

సైబర్‌ మోసాల ‘కీచురాళ్ళు’

రజిషా విజయన్‌ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘కీడం’. 2022లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘కీచురాళ్ళు’ పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో నేడు (మే 30)న విడుదలవుతోంది. రాహుల్‌ రిజీ నాయర్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధాన పాత్రధారి రాధికా బాలన్‌ ఓ సైబర్‌ సెక్యూరిటీ స్టార్టప్‌ సంస్థను ప్రారంభిస్తుంది. సైబర్‌ క్రైమ్‌కు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈమెకు ఫోన్‌ చేసి బెదిరిస్తుంటాడు. అతనెవరు? ఎందుకలా చేస్తాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సుజిత్‌ వారియర్, లిజో జోసెఫ్, రంజన్‌ సంయుక్తంగా నిర్మించారు.


రామన్న రాకకు వేళాయే..

యూత్‌ లీడర్‌ రాజు పాత్రలో అభయ్‌ నవీన్‌ బేతిగంటి నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్‌’. రజనీ నిర్మాత. సొంత గ్రామంలో యువ నాయకుడిగా ఎదగాలని కలలు కంటాడు రాజు. స్థానిక రాజకీయ నాయకుడిని ఓడించేందుకు రాజు చేసిన ప్రయాత్నాలన్నీ విఫలమవుతాయి. చివరికి ఏమైందో తెలియాలంటే ఈరోజు ఈటీవీ విన్‌లో విడుదల కానున్న ఈ చిత్రం చూడాల్సిందే. శ్రీకాంత్‌ అయ్యంగార్, తాగుబోతు రమేశ్, అనిల్‌ గీలా, యాదమ్మ నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని