Cinema News: సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది.
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. ప్రేమ, హాస్యం, యాక్షన్ మేళవింపుతో ఈ చిత్రం రూపొందనున్నట్టు ఈ సినిమా ప్రకటన స్పష్టం చేస్తోంది. సూర్య త్వరలోనే ‘కంగువ’తో సందడి చేయనున్నారు. తన 43వ సినిమాని సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్న సూర్య... 44వ సినిమా కోసమే కార్తీక్ సుబ్బరాజ్తో జట్టు కట్టారు.
మెరిసే రంగీలా.. అమర్ సింగ్ చమ్కీలా
పేదరికం నుంచి వచ్చిన కళాకారుడు..పంజాబీ ప్రజల గాయకుడు...అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం ‘అమర్ సింగ్ చమ్కీలా’. పంజాబ్లో అత్యధికంగా అమ్ముడుపోయిన పాటల్లో ఈయనవే ఎక్కువ. టైటిల్ పాత్రలో దిల్జీత్ దోసాంజ్ నటించగా, ఆయన భార్య అమర్జ్యోత్ కౌర్గా పరిణీతి చోప్రా కనిపించనుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘ప్రకాశవంతంగా మెరిసే రంగీలా..అతడే మన అమర్ సింగ్ చమ్కీలా..’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. వస్త్రాల అల్లికల ఫ్యాక్టరీలో పనిచేసే చమ్కీలా గాయకుడిగా ఎలా అయ్యాడో ట్రైలర్లో చూపించారు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది.
ఫైటర్ రాజా పరిష్కారం
రామ్జ్, మాయా కృష్ణన్ జంటగా కృష్ణ ప్రసాద్ వత్యం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫైటర్ రాజా’. దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, రోషన్, శివనందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను హీరో విష్వక్ సేన్ విడుదల చేశారు. ‘‘ప్రేమ, డబ్బు, కుటుంబం... ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఫైటర్ రాజా. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం’’ అన్నారు హీరో రామ్జ్. ఈ కార్యక్రమంలో వేణు యెల్దండి, దినేష్, మాయా తదితరులు పాల్గొన్నారు.
అమ్మాయి.. నీ దారెటువైపో
గోదారి అటువైపో... నా దారి ఇటువైపో... అమ్మాయి నీ దారెటువైపో... అంటూ తను మనసిచ్చిన అమ్మాయి అన్వేషణలో ఉన్నాడు ఆ అబ్బాయి. మరి ఆమె జాడ తెలిసిందో లేదో తెలియాలంటే ‘శశివదనే’ చూడాల్సిందే. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రమిది. సాయిమోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘గోదారి అటువైపో...’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ ఈ పాటని పాడారు. కిట్టు విస్సాప్రగడ రచించారు. ఇందులోని పాటలకు మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి.
మత్స్యకారుల జీవితాల్ని ప్రతిబింబించే చిత్రమిది
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ నాయకానాయికలుగా నగేష్ నారదాసి తెరకెక్కించిన చిత్రం ‘సముద్రుడు’. బదావత్ కిషన్ నిర్మించారు. సుమన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ను గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల జీవితాల్ని ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. వారు సాగించే జీవన పోరాటం, వారు పడే మనోవేదనే ఈ చిత్రం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు.
డబ్బు కోసం సినిమల్లోకి రాలేదు
‘‘మంచి సందేశంతో నిండి ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కలియుగం పట్టణంలో’’ అంటోంది ఆయుషి పటేల్. ఆమె.. విశ్వ కార్తికేయ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రమాకాంత్ రెడ్డి తెరకెక్కించారు. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర్ రెడ్డి, కాటం రమేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం ఆయుషి. హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. అందులో చాలా కోణాలుంటాయి. దర్శకుడు రమాకాంత్ కథ ఎంత బాగా చెప్పారో.. అంత కంటే చక్కగా తెరకెక్కించారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది. నేను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికే మూడు సినిమాల్లో అవకాశాలొచ్చాయి’’ అని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే