Cinema News: ‘జీ2’ సెట్స్లోకి బనితా సంధు
అడివి శేష్ కథానాయకుడిగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీ2’. ‘
అడివి శేష్ కథానాయకుడిగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీ2’. ‘గూఢచారి’ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బనితా సంధు కథానాయిక. ఆమె తాజాగా ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం గుజరాత్లోని భుజ్లో జరుగుతున్న షెడ్యూల్లో శేష్, బనితాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంట్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుందని.. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించే లక్ష్యంగా ఈ చిత్రం కోసం పని చేస్తున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘డియర్’ వచ్చేది ఆ రోజే
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ జంటగా ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘డియర్’. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి. ఈ విషయాన్ని రెండు నిర్మాణ సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. ఈ చిత్ర ఆంధ్ర హక్కుల్ని అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకోగా.. తెలంగాణ హక్కుల్ని ఏషియన్ సినిమాస్ దక్కించుకుంది. భిన్నమైన కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఏప్రిల్ 11న విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్, ఛాయాగ్రహణం: జగదీశ్ సుందరమూర్తి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనలు నిలిపివేత!
తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. -
అందుకే ‘జనతా గ్యారెజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
వినోదభరితమైన ‘సంగీత్’
నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటగా సాద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంగీత్’. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
పతాక పోరాటంలో నాని
వారంలో ఒక్క రోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు... నాని. కోపానికి ఆ ఒక్క రోజే ఎందుకో తెలియాలంటే మాత్రం ‘సరిపోదా శనివారం’ చూడాల్సిందే. -
ప్రతిఒక్కరూ తమకు అన్వయించుకోగలిగే కథ ఇది
‘రాజు యాదవ్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రంతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
హడలెత్తిస్తాం.. నవ్వించేస్తాం
ప్రేమకథలు.. కామెడీ ఎంటర్టైనర్లు.. ఇలా భిన్నమైన జానర్లలో చిత్రాలు వచ్చినప్పటికీ హారర్ చిత్రాలంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది సినీప్రియులకి. మరి ఈ హారర్ చిత్రాలకి కామెడీ తోడైతే ప్రేక్షకులకు పండగే కదా. భయపెడుతూ.. అంతలోనే నవ్వులు పూయించే హాస్యంతో ముందుకు సాగుతుంటాయి ఈ సినిమాలు. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని హారర్ చిత్రాలు కామెడీ అంశాల మేళవింపుగా రూపొందుతున్నాయి. -
జోడీ కుదిరినట్టేనా?
అద్భుతమైన నటన.. ఆకర్షించే అందంతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. -
హైదరాబాద్లో రామ్చరణ్ ఆట
చాలా రోజులుగా సెట్స్పై ఉన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సినీ ప్రేమికులు... అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం.... అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే... అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో ఏమాత్రం రాజీపడరు శంకర్. -
ఆ మ్యాజిక్ కొన్నిసార్లే..!
సవాళ్లతో కూడిన పాత్రల్ని భుజాన మోసే కొద్దిమంది కథానాయికల్లో కీర్తిసురేశ్ ఒకరు. ‘మహానటి’కి ముందు... తర్వాత అన్నట్టుగా మారింది ఆమె కెరీర్. అప్పట్నుంచి మరింత బాధ్యతగా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తోంది కీర్తి. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనలు నిలిపివేత!
-
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
-
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
-
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్