Cinema News: అయ్యో భామ..
సుహాస్ కథానాయకుడిగా... రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్ కథానాయిక. హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సుహాస్ కథానాయకుడిగా... రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్ కథానాయిక. హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్నిచ్చారు. దర్శకులు వశిష్ఠ కెమెరా స్విచ్చాన్ చేయగా, శైలేశ్ కొలను స్క్రిప్ట్ని అందజేశారు.
అనాథ బాలిక కథ మెర్సీ కిల్లింగ్
సాయికుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. సూరపల్లి వెంకటరమణ దర్శకుడు. సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మాతలు. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. సాయికుమార్, కోన వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి హాజరయ్యారు. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్వేచ్ఛ అనే అనాథ బాలిక చుట్టూ కథ సాగుతుంద’’ని దర్శకుడు వెంకటరమణ.ఎస్ తెలిపారు.
పరిశోధన చేసి తీసిన సినిమా
‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు విరించి వర్మ. ఇప్పుడాయన నుంచి రానున్న కొత్త చిత్రం ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే, రియా సుమన్ జంటగా నటించారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.. ‘‘1980లలో జగిత్యాలలో జరిగిన వాస్తవ కథతో చక్కటి యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కించాం. దీనికోసం మేము చాలా పరిశోధన చేసి ఎంతో నిజాయతీగా రూపొందించాం’’ అన్నారు.
రా.. లవ్ మీ!
‘‘ప్రతిసారీ కొత్త కథలు దొరకవు. కొన్నిసార్లు పాత కథలతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ మేం ఓ కొత్త కథతో ‘లవ్ మీ’ చేశాం. తర్వాత సన్నివేశం ఏమిటో ఊహించలేని విధంగా ఉంటుంది’’ అన్నారు దిల్రాజు. ఆయన సంస్థ దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్... అనేది ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. వచ్చే నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ‘రావాలి రా...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనలోని ఈ గీతాన్ని చంద్రబోస్ రచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?