Cinema News: ‘మైదాన్’లో ఒక్కరిగా..
‘మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్.
‘మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్. ఆయన భారత ఫుట్బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీంగా నటిస్తున్న చిత్రమే ‘మైదాన్’. అజయ్, ప్రియమణి జంటగా అమిత్ శర్మ తెరకెక్కించారు. బోనీ కపూర్ నిర్మాత. ఏప్రిల్ 10న రానున్న సందర్భంగా అజయ్ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోని పంచుకున్నారు. ‘పదకొండు మంది ఆటగాళ్లు పదకొండు రోజుల్లో ‘మైదాన్’లో దిగనున్నారు. ఫుట్బాల్తో భారత చరిత్రను మార్చిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ అసలు కథ చూడండి!’ అనే వ్యాఖ్యల్ని జోడించారు.
మిస్టరీ హత్యల ‘అరణ్మనై 4’
‘మానవ శక్తులు ఆ దుష్టశక్తిని నియంత్రించలేవు. దైవశక్తి మాత్రమే దాన్నుంచి మనల్ని రక్షించగలదు’ అంటూ వచ్చిన ‘అరణ్మనై 4’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సుందర్.సి ప్రధాన పాత్రధారిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, రాశీఖన్నా ముఖ్యభూమికలు పోషించారు. అతీంద్రియశక్తుల కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. తమన్నా ఆత్మహత్య చేసుకోవడం.. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ శక్తిమంతమైన దుష్టశక్తిగా తిరిగి రావడం.. తర్వాత భవనంలో హత్యలు జరగడం లాంటి సంఘటనలతో ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. ఏప్రిల్లో ఈ సినిమా విడుదల కానుంది. అసలు ఆ రాజ భవనంలో జరుగుతున్న హత్యల వెనకున్న కారణం ఏంటో తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
పిలగా.. జర పైలం!
సాయితేజ, పావని కరణం జంటగా ఆనంద్ గుర్రం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. రామకృష్ణ బొద్దుల, ఎస్.కె.శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రం శ్రీను, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను సంగీత దర్శకుడు, గాయకుడు రామ్ మిరియాల ఇటీవల విడుదల చేశారు. ‘‘అంబానీలా లక్షల కోట్లు సంపాదించాలని అత్యుత్సాహంతో కలలు కన్న ఓ మధ్యతరగతి కుర్రాడి కథ ఇది. పద్మవ్యూహంలాంటి మన బ్యూరోక్రసీ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఆ కుర్రాడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది దీంట్లో వినోదాత్మకంగా చూపించనున్నాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.
అర్జున్ ఉస్తారాగా..
నిన్నటిదాకా లవర్బాయ్గా ప్రేమకథలతో అలరించిన కార్తిక్ ఆర్యన్.. ఒక్కసారిగా గేరు మార్చి యాక్షన్ బాట పట్టాడు. బాక్సర్గా పోరాటాలు చేస్తున్న ‘చందు ఛాంపియన్’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉండగా.. మరో యాక్షన్ థ్రిల్లర్కి పచ్చజెండా ఊపాడు. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించే ఈ చిత్రానికి ‘అర్జున్ ఉస్తారా’ అనే టైటిల్ ఖరారు చేశారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మాత. భావోద్వేగాలతో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దీపావళికి సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణను విదేశాల్లో జరిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తను నటిస్తున్న ‘భూల్ భులయ్యా 3’ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్