విధిని తిరగరాసే ఫరీదాన్
‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్ బృందం.
‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్ బృందం. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, సంజీదా షేక్, షెర్మిన్ సెహ్గల్, రిచా చద్ధా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ చేస్తున్న మ్యాజికల్ సిరీస్ ఇది. తాజాగా ఇందులో ఫరీదాన్గా కనిపించే సోనాక్షి పాత్రను పరిచయం చేస్తూ.. వీడియోను పంచుకున్నారు. ‘నిప్పులు కురిసే హీరామండీలో తన విధిని తిరగరాసేందుకు మళ్లీ వస్తుందీ ఫరీదాన్. మరి తన పనిలో ఆమె విజయం సాధిస్తుందా?’ అంటూ రాసుకొచ్చారు. ‘మిరుమిట్లు గొలిపే ఈ కాంతులు.. ఎన్నో చీకటి రహస్యాలను చూశాయి. ఆ సంఘటనల్ని ఈ ఫరీదాన్ ఇప్పటికీ మర్చిపోలేదు. జరిగిన ప్రతి దానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చాను’ అనే వ్యాఖ్యలతో ఉన్న ఈ వీడియో.. ఉత్సుకతని పెంచుతోంది. మే 1న సిరీస్ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
కదిలించే ప్రేమకథతో..
ఇటీవలే విడుదలైన ‘యే వతన్ మేరే వతన్’లో స్వాతంత్య్ర సమరయోధురాలిగా మెప్పించే నటన ప్రదర్శించింది బాలీవుడ్ నాయిక సారా అలీఖాన్. ఇప్పుడామె మరో కొత్త కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మెట్రో ఇన్ దినో’. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరులో విడుదల కానున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టింది సారా. ‘‘భావోద్వేగాలు, నమ్మకం ఇవన్నీ మేళవించి ఉన్న ఆధునిక జంటల హృదయాన్ని కదిలించే ప్రేమ కథను, అది చేసే మాయాజాలాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ‘మెట్రో ఇన్ దినో’ నవంబరు 29న మీ ముందుకు రాబోతుంద’ని వ్యాఖ్యల్ని జోడించింది. కొంకణాసేన్ శర్మ, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘నింద’ ఎవరిపై..?
వరుణ్సందేశ్ కథానాయకుడిగా, రాజేశ్ జగన్నాథం దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. ‘‘కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందిన చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది కూడా ఆ తరహా చిత్రమే. నింద ఎలా, ఎవరిపై పడింది? దాని పర్యవసనాలేమిటనే విషయాల్ని తెరపైనే చూడాలి. పరిశ్రమలోని చాలామంది ప్రముఖులకి ఈ సినిమాని చూపించాం. వాళ్లంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని తెలిపాయి సినీవర్గాలు. ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్, కూర్పు: అనిల్ కుమార్.
విక్రమ్ సినిమా కోసం
విక్రమ్ కథానాయకుడిగా ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర శూరన్’ తెరకెక్కనుంది. రియా శిబు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్దికీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. సిద్దికీ తెలుగులో ‘అంతిమతీర్పు’, ‘నా బంగారు తల్లి’, ‘అగ్నినక్షత్రం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘వీర ధీర శూరన్’ సినిమాని ప్రకటించారు. ఇందులో కాళి అనే పాత్రలో కనిపించనున్నారు కథానాయకుడు. ఎస్.జె.సూర్య, విజయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్కుమార్.
తిరువీర్ కల్యాణం
యువ కథానాయకుడు తిరువీర్ ఓ ఇంటివారయ్యారు. ఆయన వివాహం కల్పనారావుతో ఆదివారం తిరుమలలో జరిగింది. ‘పలాస’, ‘మసూద’ తదితర చిత్రాలతో మెప్పించిన కథానాయకుడు తిరువీర్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ కొత్త జంట ఒక్కటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!