విధిని తిరగరాసే ఫరీదాన్
‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్ బృందం.
‘హీరామండీ: ది డైమండ్ బజార్’లో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ సిరీస్ బృందం. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, సంజీదా షేక్, షెర్మిన్ సెహ్గల్, రిచా చద్ధా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ చేస్తున్న మ్యాజికల్ సిరీస్ ఇది. తాజాగా ఇందులో ఫరీదాన్గా కనిపించే సోనాక్షి పాత్రను పరిచయం చేస్తూ.. వీడియోను పంచుకున్నారు. ‘నిప్పులు కురిసే హీరామండీలో తన విధిని తిరగరాసేందుకు మళ్లీ వస్తుందీ ఫరీదాన్. మరి తన పనిలో ఆమె విజయం సాధిస్తుందా?’ అంటూ రాసుకొచ్చారు. ‘మిరుమిట్లు గొలిపే ఈ కాంతులు.. ఎన్నో చీకటి రహస్యాలను చూశాయి. ఆ సంఘటనల్ని ఈ ఫరీదాన్ ఇప్పటికీ మర్చిపోలేదు. జరిగిన ప్రతి దానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చాను’ అనే వ్యాఖ్యలతో ఉన్న ఈ వీడియో.. ఉత్సుకతని పెంచుతోంది. మే 1న సిరీస్ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
కదిలించే ప్రేమకథతో..
ఇటీవలే విడుదలైన ‘యే వతన్ మేరే వతన్’లో స్వాతంత్య్ర సమరయోధురాలిగా మెప్పించే నటన ప్రదర్శించింది బాలీవుడ్ నాయిక సారా అలీఖాన్. ఇప్పుడామె మరో కొత్త కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మెట్రో ఇన్ దినో’. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరులో విడుదల కానున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టింది సారా. ‘‘భావోద్వేగాలు, నమ్మకం ఇవన్నీ మేళవించి ఉన్న ఆధునిక జంటల హృదయాన్ని కదిలించే ప్రేమ కథను, అది చేసే మాయాజాలాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ‘మెట్రో ఇన్ దినో’ నవంబరు 29న మీ ముందుకు రాబోతుంద’ని వ్యాఖ్యల్ని జోడించింది. కొంకణాసేన్ శర్మ, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘నింద’ ఎవరిపై..?
వరుణ్సందేశ్ కథానాయకుడిగా, రాజేశ్ జగన్నాథం దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ని హైదరాబాద్లో ఆవిష్కరించారు. ‘‘కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందిన చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది కూడా ఆ తరహా చిత్రమే. నింద ఎలా, ఎవరిపై పడింది? దాని పర్యవసనాలేమిటనే విషయాల్ని తెరపైనే చూడాలి. పరిశ్రమలోని చాలామంది ప్రముఖులకి ఈ సినిమాని చూపించాం. వాళ్లంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని తెలిపాయి సినీవర్గాలు. ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్, కూర్పు: అనిల్ కుమార్.
విక్రమ్ సినిమా కోసం
విక్రమ్ కథానాయకుడిగా ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర శూరన్’ తెరకెక్కనుంది. రియా శిబు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్దికీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. సిద్దికీ తెలుగులో ‘అంతిమతీర్పు’, ‘నా బంగారు తల్లి’, ‘అగ్నినక్షత్రం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘వీర ధీర శూరన్’ సినిమాని ప్రకటించారు. ఇందులో కాళి అనే పాత్రలో కనిపించనున్నారు కథానాయకుడు. ఎస్.జె.సూర్య, విజయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్కుమార్.
తిరువీర్ కల్యాణం
యువ కథానాయకుడు తిరువీర్ ఓ ఇంటివారయ్యారు. ఆయన వివాహం కల్పనారావుతో ఆదివారం తిరుమలలో జరిగింది. ‘పలాస’, ‘మసూద’ తదితర చిత్రాలతో మెప్పించిన కథానాయకుడు తిరువీర్. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ కొత్త జంట ఒక్కటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్