Nallamala: మన్నిస్తారా మూగజీవులారా...

అమిత్‌ తివారి, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్‌ దర్శకుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. ‘మన్నిస్తారా మూగజీవులారా ...’ అంటూ సాగే ఈ   సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు

Updated : 21 Jan 2022 07:06 IST

మిత్‌ తివారి, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్‌ దర్శకుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మాత. ‘మన్నిస్తారా మూగజీవులారా ...’ అంటూ సాగే ఈ   సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సరికొత్త నేపథ్యంలో ఆసక్తికరంగా తీశారని ఈ సినిమా ప్రచార చిత్రాల్ని చూసినప్పుడంతా అనిపించేది.  మన్నిస్తారా మూగజీవులారా... పాట చాలా బాగుంది. ప్రతీ లైన్‌ హృదయాల్ని కదిలిస్తుంది. జంతువుల విషయంలో మనం ఎంత అమానుషంగా ఉంటున్నామో  అర్థమవుతుంది. ఇలాంటి అంశాన్ని ఎంచుకున్న  నల్లమల బృందాన్ని   అభినందిస్తున్నా’’ అన్నారు. అజయ్‌ ఘోష్‌, కాశీ విశ్వనాథ్‌, కాలకేయ ప్రభాకర్‌, చలాకీ చంటి, శుభోదయం రాజశేఖర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం, పాటలు: పీఆర్‌, ఛాయాగ్రహణం: వేణు మురళి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని