Tollywood: పాన్ ఇండియా మార్కెట్... ఈసారి మన ప్రభావం ఎంత?
టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. అన్ని చిత్రసీమలదీ ‘పాన్ ఇండియా’ జపమే! భాషల మధ్య హద్దుల్ని చెరిపేసి సరికొత్త వ్యాపారానికి బాటలు వేసిన మార్కెట్ వ్యూహం ఇది. ప్రాంతీయ భాషల్లో రూపొందిన చిత్రాలు సైతం జాతీయ స్థాయిలో వీరవిహారం చేయొచ్చనీ.. ‘మన మార్కెట్ పరిధి ఇంతే’ అన్న పరిమితులు దాటి వసూళ్లు కొల్లగొట్టవచ్చనీ వేసిన చాటింపు ఇది.
టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. అన్ని చిత్రసీమలదీ ‘పాన్ ఇండియా’ జపమే! భాషల మధ్య హద్దుల్ని చెరిపేసి సరికొత్త వ్యాపారానికి బాటలు వేసిన మార్కెట్ వ్యూహం ఇది. ప్రాంతీయ భాషల్లో రూపొందిన చిత్రాలు సైతం జాతీయ స్థాయిలో వీరవిహారం చేయొచ్చనీ.. ‘మన మార్కెట్ పరిధి ఇంతే’ అన్న పరిమితులు దాటి వసూళ్లు కొల్లగొట్టవచ్చనీ వేసిన చాటింపు ఇది.ఈ సూత్రాన్ని అందరికంటే ఎక్కువగా తెలుగు పరిశ్రమే ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు మన దగ్గర రూపొందుతుండడమే అందుకు కారణం. మరి 2023లో మనం ఎంత ప్రభావం చూపించాం?
బాలీవుడ్ కోటపై ప్రభాస్ జెండా ఎగరేసినా.. ‘తగ్గేదేలే’ అంటూ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ‘పుష్ప’ మేనరిజమ్తో ఊగిపోయినా... ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్చరణ్లు మరోసారి ఉత్తరాది బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టినా అదంతా పాన్ ఇండియా ట్రెండ్ ప్రభావమే. ‘బాహుబలి’, ‘కె.జి.ఎఫ్.’ చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా ఫీవర్ మొదలైంది. ‘కార్తికేయ2’, ‘కాంతార’ తదితర చిత్రాలు సత్తా చాటాయి.సినిమా ఏ భాషలో తెరకెక్కిందన్నది ముఖ్యం కాదు... అందులో బలం ఉంటే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుందని ఆ సినిమాలు చాటి చెప్పాయి. అప్పట్నుంచి అదే బాటలో భారీ కథల్ని తెరకెక్కించి జాతీయస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నచ్చింది మనకే
నాని నటించిన ‘దసరా’, ‘హాయ్ నాన్న’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, విజయ్ దేవరకొండ ‘ఖుషి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, సమంత ‘శాకుంతలం’, రామ్ ‘స్కంద’, నిఖిల్ ‘స్పై’, పాయల్ రాజ్పూత్ నటించిన ‘మంగళవారం’... ఇలా ఈ సంవత్సరం చాలా సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ‘ఏజెంట్’ కూడా పాన్ ఇండియా చిత్రంగానే పట్టాలెక్కింది. కానీ తెలుగులోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘విరూపాక్ష’, ‘ఖుషి’, ‘మంగళవారం’ చిత్రాలు మన ప్రేక్షకుల్ని మెప్పిస్తూ, మంచి వసూళ్లని సాధించాయి. పొరుగు భాషల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మిగతా చిత్రాలైతే ఎక్కడా సరైన ఆదరణ పొందలేకపోయాయి. ‘సార్’, ‘కస్టడీ’ చిత్రాలు ద్విభాషా చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ‘సార్’ మాత్రమే విజయాన్ని అందుకుంది.
గాలి అటు నుంచి...
కొన్నేళ్లుగా ఎక్కువగా మన చిత్రాలే పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపించాయి. ఈసారి మాత్రం గాలి అటు నుంచి ఇటు వీచింది. హిందీ కథానాయకుడు రణ్బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సొంతం చేసుకొంటోంది. తెలుగు దర్శకుడు, ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కించారు. షారుక్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టాయి. రజనీకాంత్కి ‘జైలర్’తో ఘనవిజయం దక్కింది. విక్రమ్ ‘పొన్నియిన్ సెల్వన్2’ ఫర్వాలేదనిపించింది. విజయ్ ‘లియో’ చిత్రానికీ మంచి వసూళ్లు దక్కాయి. ‘మార్క్ ఆంటోనీ’, ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ తదితర చిత్రాలు తెలుగు మార్కెట్పై కొద్దిమేర ప్రభావం చూపించాయి. హిందీ నుంచి వచ్చిన సన్నీ దేవోల్ ‘గదర్2’, సల్మాన్ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీకీ జాన్’, ‘టైగర్ 3’ చిత్రాలు హిందీ స్థాయిలో తెలుగు మార్కెట్లో ప్రభావం చూపించలేకపోయాయి. పాన్ ఇండియా హంగులతో రూపొందే సినిమాలు కొన్నయితే, ఆ మార్కెట్ని సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో రూపొందే సినిమాలు ఇంకొన్ని. అలా మార్కెట్ని సొమ్ము చేసుకోవాలని వచ్చిన చిత్రాలేవీ ప్రభావం చూపించలేకపోయాయి.
సలార్పైనే దృష్టి
కొద్దిమంది హీరోలు సినిమా చేశారంటే... ఇక అది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సిందే. వాళ్లు చేసే సినిమాల స్థాయి, వాళ్లకున్న గుర్తింపు అలాంటిది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్చరణ్లు... ఇప్పుడు అదే బాటలోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రభాస్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతోంది. ఈ ఏడాది ఆయన నటించిన ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ హంగులతో రూపొందిన ఆ చిత్రం ఆయన మార్కెట్కి తగ్గట్టుగానే పలు భాషల్లో విడుదలైంది. కానీ హిందీ దర్శకుడు ఓం రౌత్ తీసిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇప్పుడందరి దృష్టి ఈ నెల 22న విడుదలవుతున్న ‘సలార్’పైనే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు