Pankaj Tripathi: ఎవరూ ఇష్టపడనప్పుడూ ఆమె ప్రేమించింది : ‘మీర్జాపూర్‌’ నటుడి ప్రేమకథ ఇది

కెరీర్‌ పరంగా సక్సెస్‌ లేని సమయంలో తన సతీమణి ఎంతగానో అండగా నిలిచిందని బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) అన్నారు.

Published : 11 Apr 2024 17:32 IST

ముంబయి: ‘మీర్జాపూర్‌’లో కలీన్‌ భయ్యాగా నటించి విశేష ఆదరణను సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి. కెరీర్‌ పరంగా ప్రస్తుతం అందరి ప్రశంసలు పొందుతున్న ఆయన ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిమానించేవారే లేక తొలి సక్సెస్‌ కోసం కొన్నేళ్ల పాటు శ్రమించారు. సవాళ్లు ఎదురైనప్పుడు తన సతీమణి మృదుల అండగా నిలిచిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘1993లో జరిగిన బంధువుల పెళ్లిలో తొలిసారి నా సతీమణి మృదులను చూశా. అప్పుడు మేము వేర్వేరు కాలేజీల్లో చదువుతున్నాం. అభిరుచులు, ఇష్టాయిష్టాలు కలవడంతో ప్రేమలో పడ్డాం. పెద్దల అంగీకారంతో 2004లో మా వివాహం జరిగింది. 2006లో ఆషీ జన్మించింది. కెరీర్‌ పరంగా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. చాలా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించినా గుర్తింపురాలేదు. అలాంటి సమయంలో మృదుల నాకు అండగా నిలిచింది. నిజం చెప్పాలంటే, తనే నా రియల్‌ హీరో. చుట్టుపక్కల ఉండే చిన్న పిల్లలకు చదువు చెప్పి.. కుటుంబపోషణలో సాయం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆడిషన్స్‌ ఇచ్చా. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపుర్‌’తో నటుడిగా విజయాన్ని అందుకున్నా. ప్రేక్షకులెవరూ ఇష్టపడని సమయంలోనూ ఆమె నన్ను అభిమానించింది’’ అని పంకజ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని