Naa Saami Ranga: ‘నా సామిరంగ’ బాగుంది కానీ..: పరుచూరి గోపాలకృష్ణ
నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.
ఇంటర్నెట్ డెస్క్: ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమా బాగున్నా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) అభిప్రాయం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మేనన్, రుక్సర్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ‘డిస్నీ+హాట్స్టార్’ (Naa Saami Ranga On Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, దీనికి గురించి పరుచూరి ఏమన్నారంటే?
‘‘ఈ సినిమా బాగుంది. కానీ, వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఏ నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకైనా సంతృప్తిన్నిచ్చే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఆ జాబితాలోదే ఈ సినిమా. మంచి ఎంటర్టైనర్. దాసరి నారాయణరావుగారి టెక్నిక్ను యువ దర్శకులు ఫాలోకావడంలేదు. ఆయన సినిమాలన్నింటిలో ఆఖరి అరగంటకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. దీంతో, ముందు నుంచీ ఎలా ఉన్నా సినిమాని చివరిలో ప్రేక్షకులు కళ్లార్పకుండా చూసేవారు. ‘నా సామిరంగ’ విషయానికొస్తే.. ఫస్టాఫ్లో రొమాన్స్కు ప్రాధాన్యత ఇచ్చారు. నవ్వులు పంచారు. సెకండాఫ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీకి దర్శకుడిగా తొలి చిత్రమిది. మలయాళ సినిమా (పొరింజు మరియమ్ జోస్) కథను తీసుకుని కొన్ని మార్పులతో తెరకెక్కించారు’’
‘‘ఒక చిత్రాన్ని ఓ హీరో బాడీ లాంగ్వేజ్ నుంచి మరో హీరో బాడీ లాంగ్వేజ్కు మార్చేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ మూవీలోని నటుల ఆహార్యం ఎలా ఉంటుందో ఇందులోనూ అలానే చూపించే ప్రయత్నం చేశారు. గెడ్డం పెంచి, లుంగీ ధరించి నాగార్జున కొత్తగా కనిపించారు. కిష్టయ్య పాత్రను ఆయన ప్రేమించారు. కళ్లతోనే నటించి, అలరించారు. రావు రమేశ్ పాత్రను ఇంటర్వెల్లో ముగించకుండా ఉండుంటే బాగుండేదనేది నా అభిప్రాయం’’
‘‘ఆ క్యారెక్టర్ అక్కడితో ఎండ్కావడంతో సెకండాఫ్లో కొత్త విలన్ వస్తాడని, కొత్త ప్రయాణం మొదలవుతుందని ప్రేక్షకుడికి అర్థమవుతుంది. కుమార్తెను భయపెట్టేందుకే రావు రమేశ్ పాత్రను అలా మలిచారని అనుకుంటున్నా. ఆ రోల్ను అంతం చేయకుండా ఉండుంటే కథనం ఇంకా బిగువుగా ఉండేదని భావిస్తున్నా. విజయ్ బిన్నీ ఎంతో ఆలోచించి అలా చేసుండొచ్చు. అల్లరి నరేశ్ పాత్రనూ అంతం చేయడం ఇబ్బందిగా అనిపించింది. పెద్ద హీరో సినిమాలో ఆయన పక్కన ఉండే క్యారెక్టర్లు చనిపోతే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. హీరో.. విలన్లను చంపుతూ వెళ్తే సినిమాలు సూపర్హిట్ అవుతాయి. విలన్లు.. హీరో మనుషులను చంపుతూ వెళ్తే దెబ్బతింటాయి. కానీ, ఈ చిత్రం దాన్నుంచి లక్కీగా బయటపడింది. ఆ రెండు పాత్రలను అంతం చేయకుండా ఉండుంటే మరిన్ని వసూళ్లు రాబట్టేదీ సినిమా. నాజర్గారు పోషించిన పాత్ర ఆఖరిలో చేసిన పని కూడా నన్ను ఆకట్టుకోలేదు. వీటిలో మార్పులు చేసుంటే ఇంకా బాగుండేది. చిత్ర బృందానికి అభినందనలు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ (Animal) గురించి స్పందించారు నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆ చిత్రంపై వచ్చిన విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్