Prabhas: ప్రభాస్‌- దిశా పటానీ.. ఫొటో వైరల్‌

ప్రభాస్‌, దిశా పటానీ కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 08 Mar 2024 00:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్‌, దిశా పటానీ (Disha Patani) కలిసి దిగిన ఫొటోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ప్రభాస్‌ కళ్లద్దాలు పెట్టుకుని, స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ఇద్దరూ నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరిపై పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్‌ ఓ సందర్భంలో తెలిపారు. ‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన స్టోరీ కాబట్టి అందుకు తగ్గట్టు ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం’’ అని చెప్పారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయిక. దిశాతోపాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని