Etv Win: ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

మమితా బైజు నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. 

Published : 29 Apr 2024 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రేమలు’తో అన్ని భాషల వారిని ఆకట్టుకున్నారు హీరోయిన్ మమితా బైజు. దీంతో ఆమె గతంలో నటించిన సినిమాల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అర్జున్‌ అశోకన్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. గతేడాది ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మలయాళ సినిమా యూత్‌ మనసు దోచుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్‌ ముందుకుతీసుకురానుంది ఈటీవీ విన్‌. మే 2 నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ‘ప్రణయ విలాసం’ స్ట్రీమింగ్‌ కానుంది.

‘మీరు పెట్టిన అన్ని మెసేజ్‌లకు ఇక్కడే సమాధానం దొరుకుతుంది. మొదటి ప్రేమ అందరి జీవితంలోనూ ఎప్పటికీ సజీవమే. అది ఎప్పుడూ రొమాంటిక్‌గానే ఉంటుంది’ అని పేర్కొంటూ స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించింది. తొలిప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే అనే కాన్సెప్ట్‌తో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు నిఖిల్ మురళి. నటీనటులు ప్రేమకథతో పాటు వారి హీరో తల్లిదండ్రుల తొలి ప్రేమను కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. తన తల్లి ప్రేమను అర్థం చేసుకున్న హీరో ఆమె చివరి కోరికను ఎలా నేరవేర్చాడన్నది కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని