Prithviraj Sukumaran: ఆడు జీవితం.. అలాంటి సీన్‌ మేము షూట్‌ చేయలేదు: పృథ్వీరాజ్‌ క్లారిటీ

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) నటించిన రీసెంట్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌) (aadujeevitham).

Published : 14 Apr 2024 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran), అమలాపాల్‌ (Amala Paul) కీలకపాత్రల్లో నటించిన రీసెంట్‌ సర్వైవల్ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్‌) (Aadujeevitham). బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఇది బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సన్నివేశం ఇటీవల కాలంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ‘గోట్ డేస్’లో రాసిన విధంగా ఓ వివాదాస్పద సన్నివేశాన్ని చిత్రబృందం షూట్‌ చేసిందని.. సెన్సార్‌ అంగీకరించకపోవడంతో దాన్ని తొలగించారని ఆన్‌లైన్‌లో ప్రచారం జరిగింది.

దీనిపై తాజాగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించారు. తాము అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించలేదని స్పష్టతనిచ్చారు. ‘‘మేం అలాంటి సీన్‌ చేయలేదు. తన సినిమాలో హీరో పాత్ర అలా ప్రవర్తించకూడదని మా దర్శకుడు భావించాడు. 2008లో బ్లెస్సీ ఈ కథతో నా వద్దకు వచ్చినప్పుడు.. ఆ పాత్రకు ఏవిధంగా న్యాయం చేయాలనే ఆలోచించా. నవల ప్రకారం ఆ పాత్రను అర్థం చేసుకోవాలా? లేదా బ్లెస్సీ చెప్పిన విధంగా ఊహించుకోవాలా? అని తొలుత గందరగోళానికి గురయ్యా. చివరకు నేనూ - బ్లెస్సీ ఒక నిర్ణయానికి వచ్చి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా దానిని తీర్చిదిద్దాం’’ అని తెలిపారు.

కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ను రచించారు. 2008లో అత్య‌ధికంగా అమ్ముడైన మ‌ల‌యాళీ న‌వ‌ల ఇదే. దీనిని చిత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ‘ఆడు జీవితం’ను తెరకెక్కించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 31 కిలోల బరువు తగ్గారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో 72 గంటలపాటు భోజనం లేకుండా కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగి నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని