priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం

 ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది.

Updated : 25 Mar 2024 14:29 IST

హైదరాబాద్‌: క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి మంచి కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రియదర్శి(Priyadarshi). ‘మల్లేశం’, ‘బలగం’ చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. హీరోగా మరో కొత్త సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనిని దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ (mohana krishna Indreaganti) తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రూప ఈ చిత్రంలో కథానాయిక. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌ పీజీ విందా. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది.

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రంలో ప్రియదర్శి నటించారు. దీనిని శ్రీ హర్ష కొనుగంటి రూపొందించారు.  ఈ సినిమా మార్చి 22న విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రస్తుతం థియేటర్‌లో ఆడియన్స్‌ను అలరిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’లోనూ దర్శి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని