Sabari: ‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్

‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు.

Published : 20 Apr 2024 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రధారిగా... అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. ఈసందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అని ఆయన అన్నారు. ‘నేను తొలి సినిమా ఏది చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో మా దర్శకుడు నాకు ‘శబరి’ కథ చెప్పారు. బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. అప్పటికే ఈ కథ వరలక్ష్మీ శరత్ కుమార్ విన్నారు. ఆమె గొప్ప నటి. మొదటి సినిమాకు ఏ నిర్మాత అయినా సేఫ్ సైడ్ చూసుకుంటారు కదా! ఆవిడ మొదటినుంచీ మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆమె ఓకే చేశారంటే 50 శాతం నిర్మాతలు సేఫ్ అయినట్లే. నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలామందికి తెలియదు. ఖర్చు చేయమని ఏ విషయంలోనూ అడగరు. బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారని, వద్దని చెబుతారు. 'మీకు మరో సినిమా చేస్తాను. మనం చేద్దాం' అని నాతో చెప్పారు. ఈ చిత్రం తల్లీకూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కింది. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించాం. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం కొంచెం రిస్క్‌ అనిపించింది. మొదటినుంచి నాది రిస్క్‌ తీసుకునే స్వభావమే’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని