Vamsi Karumanchi: నిర్మాణంలో అదే పెద్ద సవాల్
‘‘ఆనంద్ దేవరకొండ గత చిత్రం ‘బేబీ’కి పూర్తి భిన్నంగా..హాస్యం ప్రధానంగా ‘గం గం గణేశా’ తెరకెక్కింది. తను మరో కొత్త రకమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరిస్తాడ’’ని చెప్పారు వంశీ కారుమంచి. ఆయన కేదార్ సెలగం శెట్టితో కలిసి నిర్మించిన చిత్రమే.. ‘గం గం గణేశా’.
‘‘ఆనంద్ దేవరకొండ గత చిత్రం ‘బేబీ’కి పూర్తి భిన్నంగా..హాస్యం ప్రధానంగా ‘గం గం గణేశా’ తెరకెక్కింది. తను మరో కొత్త రకమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరిస్తాడ’’ని చెప్పారు వంశీ కారుమంచి. ఆయన కేదార్ సెలగం శెట్టితో కలిసి నిర్మించిన చిత్రమే.. ‘గం గం గణేశా’. ఆనంద్ దేవరకొండ కథానాయకుడు. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వంశీ కారుమంచి సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘గణేశ్ విగ్రహం చుట్టూ సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వినాయక చవితికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఆనంద్కి కొత్తగా ఉంటుందని నమ్మి ఆయనకి ఈ కథ చెప్పాం. ఆయనా ఇప్పటిదాకా చేయని కథ అని వెంటనే ఒప్పుకున్నారు. జులాయి తరహా పాత్రలో కనిపిస్తాడు. స్నేహితుల్లో కొంతమంది చేసే కొన్ని పనులు గమ్మత్తైన సమస్యల్ని సృష్టిస్తుంటాయి. వాటి గురించి వినేవాళ్లకి కామెడీగా అనిపిస్తుంటాయి. అలాంటి కథతోనే ఈ చిత్రం రూపొందింది. ఆనంద్తోపాటు, జబర్దస్త్ ఇమ్మానుయేల్, నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి నటనని ప్రదర్శించారు. ‘బేబీ’ తర్వాత ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం మాకు చాలా రకాలుగా ప్రయోజనకరంగా ఉంది. అదే సమయంలో కొన్ని భయాలూ ఉన్నాయి. ఆనంద్ అనగానే ‘బేబీ’ సినిమానే గుర్తు చేస్తున్నారు. అన్ని సినిమాలూ ‘బేబీ’ కావు, అది ప్రేమకథ, ఇది యాక్షన్తో కూడిన కామెడీ కథ అంటూ ప్రచారం చేస్తున్నాం’’.
‘‘విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ నాకు మంచి మిత్రులు. ఆ అనుబంధంతోనే ఆనంద్తో ఈ సినిమా చేశాం. అమెరికాలో ఐటీ వ్యాపారం మా నేపథ్యం. గుంటూరు మా సొంతూరు. సినిమా అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఇక్కడైనా, అమెరికాలో అయినా తొలి రోజు తొలి ఆట బ్యాచ్ మాది. ఆ ఇష్టంతోనే ఎప్పటికైనా సినిమా నిర్మాణంలోకి రావాలనుకున్నాం. కరోనా సమయంలో అమెరికా నుంచి వచ్చి ఇక్కడే ఆగిపోయాం. అప్పుడే నిర్మాణంలోకి అడుగుపెట్టి ఈ సినిమా చేశా. సినిమా పరిశ్రమ చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ, చాలా పెద్దది. ఇతర చాలా రంగాలు చిత్ర పరిశ్రమతో ముడిపడి ఉంటాయి. చాలా క్లిష్టమైన రంగం. ఇక్కడ సృజనాత్మకతని కచ్చితంగా అంచనా వేయడం ఓ పెద్ద సవాల్. బడ్జెట్ పరంగానూ, సృజనాత్మకంగానూ తొలి సినిమా ఎన్నో అనుభవాల్ని పంచింది. ఆ అనుభవం భవిష్యత్తు సినిమాలకి ఉపయోగపడుతుంది. ఇకపై కూడా సినిమాలు చేస్తూనే ఉంటాం. నా అభిమాన కథానాయకుడు బాలకృష్ణ. ఆయనతో సినిమా చేయాలనేది నా కల. ఆ అవకాశం వస్తే అదొక వరంలా భావిస్తా. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ కథపై చర్చలు జరుగుతున్నాయి. రెండు మూడు నెలల్లో ఆ సినిమాని సెట్స్పైకి తీసుకెళతాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..