Mohanlal: ఖురేషి అబ్రమ్‌ మళ్లీ వస్తున్నాడు

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించిన సినిమా ‘లూసిఫర్‌’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Published : 22 May 2024 00:58 IST

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించిన సినిమా ‘లూసిఫర్‌’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘ఎల్‌2 ఎంపురాన్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లూసిఫర్‌’, ‘బ్రో డాడీ’ విజయాల తర్వాత మోహన్‌లాల్‌ - పృథ్వీరాజ్‌ నుంచి వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దీనితోనే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మలయాళ చిత్రసీమలోకి అడుగు పెడుతోంది. మంగళవారం మోహన్‌లాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందులో తను ఖురేషి అబ్రమ్‌గా స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. తొలి భాగంలో స్టీఫెన్‌ నెడుంపల్లిగా కనిపించిన మోహన్‌లాల్‌.. ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడన్న రహస్యాన్ని ఈ సీక్వెల్‌లో చూపించనున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తిరువనంతపురంలో జరుగుతోంది. త్వరలోనే గుజరాత్, యూఏఈల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంట్లో టోవినో థామస్, మంజు వారియర్, నందు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీపిక్‌ దేవ్‌ సంగీతమందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని