Raashi Khanna: మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా

రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 28 Mar 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యోధ’. దాదాపు పదేళ్ల తర్వాత రాశీఖన్నా బాలీవుడ్‌లో నటించిన చిత్రం ఇది. సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓఝా సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలైంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా సిద్ధార్థ్‌ మల్హోత్రా గురించి మాట్లాడారు. ‘‘సిద్ధార్థ్‌, నేను గొప్ప స్నేహితులం కాదు. సినిమాలో మా పాత్రలకు తగ్గట్టుగా నటిచాం. మా మధ్య గౌరవప్రదమైన నటీనటుల సంబంధం మాత్రమే ఉంది. షూటింగ్‌ టైమ్‌లో దిల్లీ యాసలో మాట్లాడుకునేవాళ్లం. ఎందుకుంటే ఇద్దరం అక్కడే జన్మించాం. పుస్తకాలు, సినిమాల గురించి చర్చించుకున్నాం. ఇంతకంటే మా మధ్య ఎక్కువ మాటలు ఉండేవి కాదు. తను కూడా నాలా ఇంట్రావర్ట్‌. ఈ విషయం తనని మొదటిసారి కలిసినప్పుడే అర్థమైంది. సినిమా విషయానికి వస్తే ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. అది ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. చిత్రబృందం అద్భుతంగా వర్క్‌ చేసింది. భవిష్యత్తులో అన్నిరకాల పాత్రల్లో నటిస్తాను. నా వద్దకు వచ్చిన పాత్రకు న్యాయం చేయగలననే నమ్మకం ఉంది’’ అని రాశీఖన్నా పేర్కొన్నారు. 

గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది సబర్మతీ రిపోర్ట్‌’లో రాశీఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’తో విజయాన్ని అందుకున్న విక్రాంత్‌ మాస్సే ఇందులో జర్నలిస్ట్‌ అమర్‌ పాత్రలో కనిపించనున్నారు. రంజన్‌ చందేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మే 3న ఈ చిత్రం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని