Raashi Khanna: మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యోధ’. దాదాపు పదేళ్ల తర్వాత రాశీఖన్నా బాలీవుడ్లో నటించిన చిత్రం ఇది. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓఝా సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలైంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడారు. ‘‘సిద్ధార్థ్, నేను గొప్ప స్నేహితులం కాదు. సినిమాలో మా పాత్రలకు తగ్గట్టుగా నటిచాం. మా మధ్య గౌరవప్రదమైన నటీనటుల సంబంధం మాత్రమే ఉంది. షూటింగ్ టైమ్లో దిల్లీ యాసలో మాట్లాడుకునేవాళ్లం. ఎందుకుంటే ఇద్దరం అక్కడే జన్మించాం. పుస్తకాలు, సినిమాల గురించి చర్చించుకున్నాం. ఇంతకంటే మా మధ్య ఎక్కువ మాటలు ఉండేవి కాదు. తను కూడా నాలా ఇంట్రావర్ట్. ఈ విషయం తనని మొదటిసారి కలిసినప్పుడే అర్థమైంది. సినిమా విషయానికి వస్తే ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. అది ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. చిత్రబృందం అద్భుతంగా వర్క్ చేసింది. భవిష్యత్తులో అన్నిరకాల పాత్రల్లో నటిస్తాను. నా వద్దకు వచ్చిన పాత్రకు న్యాయం చేయగలననే నమ్మకం ఉంది’’ అని రాశీఖన్నా పేర్కొన్నారు.
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది సబర్మతీ రిపోర్ట్’లో రాశీఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘ట్వెల్త్ ఫెయిల్’తో విజయాన్ని అందుకున్న విక్రాంత్ మాస్సే ఇందులో జర్నలిస్ట్ అమర్ పాత్రలో కనిపించనున్నారు. రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 3న ఈ చిత్రం విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
‘కల్కి 2898 ఏడీ’ మ్యూజిక్ ఇలా క్రియేట్ చేశారు: సంతోశ్ నారాయణన్ మెమొరీస్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీనికి తానెలా మ్యూజిక్ అందించారో సంతోశ్ నారాయణన్ వివరించారు.
-
ఎన్నో చిత్రాల్లో చేసినా.. ‘లిల్లీ’గానే గుర్తున్నా : రష్మిక
విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలై నేటికి ఐదేళ్లు. ఈసందర్భంగా రష్మిక స్పెషల్ పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
అలాంటి వారికోసం సమయాన్ని వృథా చేసుకోవద్దు: పరిణితీ చోప్రా
ప్రపంచాన్ని మరిచిపోయి జీవించాలని తన అభిమానులకి జీవిత పాఠాలు చెబుతోంది పరిణితీ చోప్రా. -
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
Double Ismart movie: రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ డీల్ పూర్తయింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేశారు.. ట్రైలర్ చూశారా?
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
ఎన్టీఆర్ కోసం మరో విలన్?
‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అజిత్?
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త కలయికకు రంగం సిద్ధం చేశారా? ‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అగ్ర కథానాయకుడు అజిత్ను తీసుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు