Raashii Khanna: మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్‌..

సిద్ధార్థ్‌ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు.

Published : 29 Mar 2024 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధార్థ్‌ మల్హోత్ర - రాశీఖన్నా (Rashi Khanna) కలిసి నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యోధ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. అయితే, అందులో వీళ్లిద్దరి కెమిస్ట్రీ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై రాశీ స్పందించారు. ‘‘నాది అందరితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం కాదు. సిద్ధార్థ్‌ కూడా అలానే ఉంటారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కాము. అవసరం ఉంటేనే మాట్లాడుకుంటాం. ‘యోధ’లో కథ అవసరం మేరకు నటించాం. స్క్రీన్‌పై మా కెమిస్ట్రీ బాగుందంటే అర్థం.. మేమిద్దరం బయట కూడా అలాగే ఉంటామని కాదు. మేము మా హద్దులు ఎప్పుడూ దాటలేదు. ఇద్దరం దిల్లీ నుంచే వచ్చాం. ఎప్పుడైనా కలిసినప్పుడు ఎక్కువగా మా ప్రాంతం గురించే మాట్లాడుకుంటాం’’ అని చెప్పారు.

ఇక షాహిద్‌కపూర్‌, విజయ్‌ సేతుపతి, కేకే మేనన్‌, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ఫర్జీ’ వెబ్‌ సిరీస్‌పై కూడా ఆమె అప్‌డేట్‌ ఇచ్చారు. గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు దీని సీక్వెల్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా నటి రాశీఖన్నా దీని గురించి మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఇద్దరూ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారని.. దీనితర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్‌3’ సిరీస్‌ చేయాలని రాశీ చెప్పారు. ఈ రెండింటి తర్వాతే ‘ఫర్జీ’ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని